ములుగు.. విప్లవాల పుట్టినిల్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం విస్తీర్ణంలో అతి పెద్దది. ఆదివాసుల ఖిల్లాగా పేరొందింది. అటవీ ప్రాంతంతో కూడుకొని ప్రకృతి రమణీయతకు, పర్యాటకానికి చిరునామాగా మారింది.
న్యూస్టుడే, ములుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం విస్తీర్ణంలో అతి పెద్దది. ఆదివాసుల ఖిల్లాగా పేరొందింది. అటవీ ప్రాంతంతో కూడుకొని ప్రకృతి రమణీయతకు, పర్యాటకానికి చిరునామాగా మారింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, వేలాడే వంతెనల లక్నవరం సరస్సు, హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తాడ్వాయి ఏటూరునాగారం అభయారణ్యాలు, గోదావరి నది, ఆసియాలోనే అతి పెద్ద దేవాదుల ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం సమ్మక్క-సారక్క బ్యారేజి ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేకతలు. ఒకప్పుడు విప్లవ పార్టీలకు పుట్టినిల్లుగా నిలిచిన ములుగు ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది.
నియోజకవర్గం ముచ్చట
ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దం కిందటి వరకు రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని విప్లవ గ్రూపులు ఉండేవి. ఎన్నికల సమయంలో నాయకులు ప్రచారానికి వెళ్లాలంటే బిక్కు బిక్కుమంటూ ప్రచారం చేసుకోవాల్సిందే. నియోజవర్గంలోని 75 శాతం గ్రామాలు అటవీ ప్రాంతంతో ముడిపడి ఉండడంతో నక్సల్స్ గ్రూపులు ఆటవీ ప్రాంతాన్ని స్థావరాలుగా మార్చుకుని కార్యకలాపాలు సాగించేవి. సంచలనాలకు మారుపేరైన మావోయిస్టు పార్టీతోపాటు ప్రతిఘటన, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, న్యూ డెమాక్రసీ పార్టీలు ములుగు నియోజకవర్గ కేంద్రంగా వాటి కార్యకలాపాలకు వ్యూహరచన చేసేవి. పోలీసుల ప్రాబల్యం పెరగడంతో ప్రస్తుతం మావోయిస్టులు మినహా మిగిలిన అన్ని గ్రూపుల కార్యకలాపాలు తగ్గాయి. ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, జనశక్తి పార్టీలు కూడా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుండేవి.
2,84,481 హెక్టార్ల విస్తీర్ణం
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం 6,55,383 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 1,98,445 హెక్టార్లలో అడవి ఉంది. చాలా గ్రామాలు అటవీ ప్రాంతంలో వాగులవతల ఉండటంతో నాటు పడవల్లో వెళ్లి పోలింగ్ నిర్వహించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం వంతెనల నిర్మాణంతో పోలింగ్ ఇబ్బందులు తగ్గాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆవిర్భావ సమయంలో పీడీఎఫ్ పేరుతో పోటీ చేసి కమ్యూనిస్టులు కైవసం చేసుకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువసార్లు గెలిచారు. రెండో స్థానంలో తెదేపా నిలిచింది. రాష్ట్రంలో తెరాస(ప్రస్తుతం భారాస) ఆవిర్భవించి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. 2014 ఎన్నికల్లో ఒక్కసారే గెలిచింది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎనిమిది సార్లు, తెదేపా నాలుగు సార్లు, పీడీఎఫ్ రెండు సార్లు, తెరాస ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా సంతోష్ చక్రవర్తి గెలిచి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. తొలిసారి జరిగిన 1952 ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా పీడీఎఫ్ నుంచి హనుమంతరావు గెలిచి చరిత్రలో నిలిచిపోయారు. 1957 ఎన్నికల్లో ములుగు మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన సూర్యనేని రాజేశ్వర్రావు పీడీఎఫ్ రెండో ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కమ్యూనిస్టులు ఏనాడూ దక్కించుకోలేదు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ములుగు నియోజకవర్గాన్ని గిరిజనులకు రిజర్వు చేశారు. పోరిక జగన్నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి తొలి గిరిజన ఎమ్మెల్యేగా నమోదయ్యారు. 1983లో ఎన్టీఆర్ తెదేపా ఏర్పాటు చేసి ప్రభంజనం సృష్టించినప్పటికీ ములుగు నియోజకవర్గంలో ప్రభావం చూపలేదు.
ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లు: 220886
పురుషులు: 108588
స్త్రీలు: 112277
ఇతరులు: 21
బరిలో ఉన్న అభ్యర్థులు...
భారాస: బడే నాగజ్యోతి
కాంగ్రెస్: ధనసరి అనసూయ సీతక్క
భాజపా: ఇంకా ప్రకటించలేదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
పరీక్షే జీవితం కాదు.. తప్పితే మళ్లీ రాద్దాం!
[ 30-04-2024]
జీవితం అంటే మంచి-చెడు, తీపి-చేదు, ఆనందం-విషాదం. ఎంతటి వారికైనా ఆటుపోట్లు తప్పవు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైంది కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరీక్షల్లో తప్పిన వారు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం. -
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు