అరూరికే భాజపా టికెట్
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా అరూరి రమేశ్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది.. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన అరూరి రమేశ్ తొలిసారిగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు.
అరూరి రమేశ్
సుబేదారి, న్యూస్టుడే: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా అరూరి రమేశ్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది.. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన అరూరి రమేశ్ తొలిసారిగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు.. ఆ తర్వాత తెరాసలో చేరి 2014, 2018లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నిల్లో ఓటమి పాలయ్యారు. కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన భాజపాలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై హనుమకొండలోని ప్రశాంత్నగర్లో ఆయన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు వచ్చి అరూరిని బలవంతంగా కారులో ఎక్కించుకొని హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా భాజపా నాయకులు, కార్యకర్తలు జనగామ వద్ద అడ్డుకున్నారు. చివరకు దయాకర్రావు అరూరిని హైదరాబాద్కు తీసుకెళ్లి కేసీఆర్తో మాట్లాడించారు. తర్వాత పార్టీ మారడం లేదని అరూరి ప్రకటించారు. వారం రోజుల తర్వాత అరూరి తిరిగి భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. మార్చి 16న భారాస వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 17వ తేదీన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో భాజపా కండువా కప్పుకొన్నారు.
పలువురు పోటీ పడినా
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసేందుకు పలువురు పోటీపడ్డారు. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, దుబాసి వాసుదేవ్ టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు భారాస నుంచి వచ్చిన అరూరికే టికెట్ దక్కింది. ప్రస్తుత జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో 1967లో గట్టుమల్లు, వెంకటమ్మ దంపతులకు అరూరి రమేశ్ జన్మించారు. 1995లో కేయూ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏటా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారాస నుంచి కడియం కావ్య పోటీ పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)