మహదేవపూర్ పోలీస్ సిబ్బందిపై వేటు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్డివిజన్ మహదేవపూర్ సర్కిల్ పరిధిలో పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. ‘ఈనాడు’లో మార్చి 16న ‘పైసా వసూల్, ఈ నెల 15న ‘కానిస్టేబుల్ బహిరంగ విందు.
ఒక్క రోజులోనే తొమ్మిది మంది బదిలీ
‘ఈనాడు’లో కథనాలకు స్పందించిన ఎస్పీ
మహదేవపూర్, న్యూస్టుడే : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్డివిజన్ మహదేవపూర్ సర్కిల్ పరిధిలో పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. ‘ఈనాడు’లో మార్చి 16న ‘పైసా వసూల్, ఈ నెల 15న ‘కానిస్టేబుల్ బహిరంగ విందు..’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే స్పందించారు. మహదేవపూర్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. పోలీస్స్టేషన్లలో వారిదే పెత్తనం.. ఏదైనా ఫిర్యాదు, సమస్యతో బాధితుడు వస్తే సంప్రదింపులు చేస్తూ అన్నీ వారి కనుసన్నల్లోనే చేయడం.. గొలుసు దుకాణాలు, బియ్యం, ఇసుక, వన్యప్రాణుల వేటకు సంబంధించి మాంసం, అక్రమ దందా వ్యవహారాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, విందులు చేసుకోవడం, నిఘా పేరిట వసూళ్ల పర్వం, డిజిటల్ ‘మామూళ్లు’, క్రమశిక్షణరాహిత్యం వంటి పలు ఆరోపణలపై ‘ఈనాడు’లో ప్రచురితమవడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేపింది.
దీనిపై స్పందించిన ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పలు ఆరోపణలు వ్యక్తమవుతున్న పోలీస్ సిబ్బందిపై నిఘా విభాగంతో పాటు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివరాలను సేకరించి, నివేదికను జిల్లా ఎస్పీకి అందించారు. దీంతో ఏడుగురు సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహదేవపూర్ సర్కిల్, పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పలు ఠాణాలకు బదిలీ చేశారు. మహదేవపూర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ ఈ.ఉపేందర్ను గణపురం, కానిస్టేబుళ్లు బి.ధనుంజయ్- మొగుళ్లపల్లి, కె.అరుణ్కుమార్-రేగొండ, ఎస్.విక్రాంత్-కాటారం, జి.కిరణ్-చిట్యాల, జె.తిరుపతి- కొయ్యూర్ పోలీస్ ఠాణాలకు బదిలీ చేశారు. మహదేవపూర్ సర్కిల్ ఎస్బీ నిఘా విభాగానికి చెందిన పి.నాగరాజును టేకుమట్ల ఠాణాకు బదిలీ చేశారు.
ఎస్సై, హెడ్కానిస్టేబుల్పై చర్యలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలి భర్త గుడాల శ్రీనివాస్ సోమవారం ఉదయం మహదేవపూర్ పోలీస్స్టేషన్లో నృత్యం చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగ్గా.. అప్పటికప్పుడే విచారణ చేసి చర్యలు చేపట్టారు. మహదేవపూర్ ఎస్సై కె.ప్రసాద్ను వీఆర్కు అటాచ్డ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, స్టేషన్ ఇన్ఛార్జిగా ఉండి అలసత్వ వహించిన హెడ్కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. ఇలా ఒక్క రోజులోనే మహదేవపూర్ ఠాణా, సర్కిల్ పరిధిలో తొమ్మిది మంది సిబ్బందిపై చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.