‘కడియం శ్రీహరివి వెన్నుపోటు రాజకీయాలు’
ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తులో మొత్తం వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడని భారాస మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు.
స్టేషన్ఘన్పూర్, న్యూస్టుడే : ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజకీయ భవిష్యత్తులో మొత్తం వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడని భారాస మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార దాహం కోసం భారాస పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరాడని మండిపడ్డారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు శ్రీహరి పేరును వింటేనే అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆనాడు తెదేపాలో అనేక పదవులు అనుభవించి చంద్రబాబుకు.. భారాసలో కేసీˆఆర్కు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. కేసీˆఆర్ను బ్లాక్ మెయిల్ చేసి మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీˆ, ఎమ్మెల్యే పదవితో పాటు.. ఆయన కుమార్తెకు ఎంపీˆ టికెట్ తీసుకొచ్చుకొని, చివరికి.. ఉడాయించారని దుయ్యబట్టారు. దేశంలో ఏ వ్యక్తి చేయలేనన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు కడియం శ్రీహరి చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా కాంగ్రెస్కు ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటున్నారని తెలిపారు. కేసీˆఆర్ తనను పిలిచి ‘నువ్వు రాజీనామా చేసినా.. నేను ఆమోదించలేదని.. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించి బాధ్యతలు అప్పగించారని’ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఎప్పుడో ఓడిపోయిందని వివరించారు. నేడు మడికొండలోని సత్యసాయి గార్డెన్లో జరిగే నియోజకవర్గ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారాస మండలాధ్యక్షుడు మాచర్ల గణేష్, జైపాల్ రెడ్డి, వారాల రమేష్, నాయకులు ఆకుల కుమార్, సురేష్కుమార్, మహేందర్రెడ్డి, బాలరాజు, చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’