నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులు
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనుమతులు లేకుండానే నిర్వహణ సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి.
జనగామ టౌన్, న్యూస్టుడే: జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని అనుమతులు లేకుండానే నిర్వహణ సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. మండలాల పరిధిలో ఆర్ఎంపీలు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెద్ద స్థాయి ఆసుపత్రుల పేరుతో నిర్వహిస్తున్న నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారుల తనిఖీలు కొరవడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొరవడుతున్న అధికారుల తనిఖీలు..
జిల్లా కేంద్రంలో ఇటీవల మెటర్నటీ, జనరల్ ఫిజిషియన్, సర్జన్, న్యూరో, ఆర్థోపెడిక్, దంత వైద్యం ఇలా పలు విభాగాల్లో విరివిగా ఆసుపత్రులను నెలకొల్పుతున్నారు. జనగామ తర్వాత స్టేషన్ఘన్పూర్ పట్టణ కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు అధికంగా ఉన్నాయి. ఆయా దవాఖానాల్లో స్పెషలిస్ట్ వైద్యులు లేకున్నా ఉన్నట్లు చూపుతున్నారు. ఆసుపత్రుల భవనాలు ఇరుకుగా ఉండటం, గాలివెలుతురు సరిగ్గా లేకున్నా, అగ్ని ప్రమాద ఘటనలు ఎదుర్కొనేందుకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు లాంటివి పాటించడం లేదు. అలాగే నిర్వాహకులు ఔషద దుకాణాలు నిర్వహిస్తూ నాసిరకం మందులను రోగులకు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్లినికల్ ల్యాబ్లో అర్హులైన టెక్నీషియన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. వీటి తనిఖీ నుంచి రెన్యూవల్ పనుల వరకు డీఎంహెచ్వో కార్యాలయంలో పని చేసే ఓ సాధారణ ఉద్యోగి చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ డీఎంహెచ్వో స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నా.. అలా జరగడం లేదు. పలువురు నిర్వాహకులు సిండికేట్ అయి స్కానింగ్ కేంద్రాలను నెలకొల్పి కొంత మంది రోగులకు అవసరం లేకున్నా స్కానింగ్లు రాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పాటించాల్సిన నియమాలు ఇలా..
ప్రైవేటు ఆసుపత్రులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంది. ప్రతి ఆసుపత్రి బోర్డు పైన రిజిస్ట్రేషన్ సంఖ్య ఉండాలి. ఆసుపత్రుల్లో వైద్యుల పేర్లు, వివరాలు అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. ఫీజుల వివరాలు కూడా పేర్కొనాలి. అవసరమైతేనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులను మాత్రమే డ్యూటీ డాక్టర్లుగా నియమించుకోవాలి. వైద్యులంతా మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వైద్యం చేయడానికి అనుమతించాలి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్న వివిధ ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు.
తనిఖీల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు
- డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్యాధికారి
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. కార్యాచరణ ప్రారంభిస్తాం. ఒక్కో బృందంలో డిప్యూటీ డీఎంహెచ్వో స్థాయి అధికారితో పాటు ప్రోగ్రాం అధికారులు, వైద్యులు ఉంటారు. వీరంతా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!