ఓరుగల్లు నుంచి ‘తొలి మహిళ’
ఓరుగల్లు కాకతీయులు ఏలిన రాజ్యం.. అలనాడు రాణి రుద్రమ దేవి తన పరాక్రమంతో శత్రువులను గజగజలాడించి మహిళా సాధికారతను చాటిచెప్పిన ధీర వనిత..
ఈనాడు, వరంగల్: ఓరుగల్లు కాకతీయులు ఏలిన రాజ్యం.. అలనాడు రాణి రుద్రమ దేవి తన పరాక్రమంతో శత్రువులను గజగజలాడించి మహిళా సాధికారతను చాటిచెప్పిన ధీర వనిత.. ఆమె వారసురాలిగా ఈ ప్రాంతం నుంచి లోక్సభలో అడుగుపెట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డాక్టర్ టి.కల్పనా దేవి. కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె ప్రైవేటు ఆసుపత్రి స్థాపించి ప్రజా వైద్యురాలిగా మంచి పేరు సంపాదించారు. 1961లో టి.నరసింహారెడ్డిని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రాజకీయాల వైపు ఆకర్షితురాలైన కల్పనాదేవి ఆ పార్టీలో 1983లో చేరారు. ఆ తర్వాత 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీచేసే అవకాశాన్ని పార్టీ ఇచ్చింది. అప్పటివరకు దేశంలో కాంగ్రెస్ ఎంతో బలంగా ఉంది. కల్పన పోటీకి ముందు రెండు సార్లు వరుసగా వరంగల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఆ కాలంలో మహిళలు రాజకీయాల్లోకి రావడమే అరుదు. అలాంటిది ఏకంగా లోక్సభకు పోటీ చేసిన తొలి మహిళే కాకుండా వరంగల్ నుంచి పార్లమెంటుకు వెళ్లిన తొలి వనితగా చరిత్ర లిఖించారు. కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దిన్ అహ్మద్పై 8,456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె చొరవతో వరంగల్లో పలు ఆసుపత్రులు, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం అమలైంది. ఆ తర్వాత 1989లో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం సురేందర్రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 1991లో మరోమారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా కలిసిరాలేదు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2016 అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM