డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు.
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్
రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్(పాతచిత్రం)
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి కచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశాలివ్వడంతో ఇప్పటికైనా ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి నెలా రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, చక్కెర పంపిణీ చేసేవారు. కొన్నేళ్లుగా కేవలం బియ్యం మాత్రమే అందజేస్తున్నారు.
జిల్లాలో 9,340 అంత్యోదయ కార్డులు
జిల్లా వ్యాప్తంగా 277 రేషన్ దుకాణాలు ఉండగా 1.23 లక్షల రేషన్ కార్డులు ఉండగా 3.45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో 9,340 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. పేరున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుండగా అన్నపూర్ణ కార్డుకు 10 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు కార్డుకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా రేషన్ డీలర్లు ఆసక్తి చూపకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది.
నెలకు 93.40 క్వింటాళ్లు అవసరం
ప్రతి కుటుంబంలో పంచదార ఒక భాగమై పోయింది. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. పండగలు, శుభకార్యాలు ఏవైనా తీపి పదార్థాలు చేసుకోవాలంటే పంచదార తప్పనిసరి. కిరాణ షాపులో కిలో పంచదార రూ.50 వరకు ఉండటంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ దుకాణాల ద్వారా నెలకు కిలో రూ.13.50కు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అంత్యోదయ కార్డులను లెక్కిస్తే నెలకు 93.40 క్వింటాళ్ల పంచదార అవసరమవుతుందని అధికారులు తెలుపుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మరోలా..
క్షేత్రస్థాయిలో సమస్య మరోలా ఉంటుందని రేషన్ డీలర్లు అంటున్నారు. అంత్యోదయ కార్డులు రేషన్ దుకాణానికి కేవలం పదుల సంఖ్యలోనే ఉంటాయి. కొన్ని దుకాణాలకు మాత్రం నాలుగు, ఐదు కార్డులే ఉన్నాయి. వారికి బియ్యంతో పాటు పంచదార పంపిణీ చేస్తే తమకు ఎందుకు ఇవ్వడం లేదని మిగతా లబ్ధిదారులు గొడవ పెడుతున్నారని అంటున్నారు. మరోవైపు ఒక రేషన్ దుకాణంలో పది మంది లోపు అంత్యోదయ కార్డుదారులు ఉంటే అందులో ప్రతి నెలా కచ్చితంగా లబ్ధిదారులు వచ్చి తీసుకెళ్తారనే నమ్మకం లేదని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని డీలర్లు అంటున్నారు.
కచ్చితంగా డీడీలు కట్టాల్సిందే
- నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
అంత్యోదయ కార్డుదారులకు ప్రతి నెలా కిలో పంచదార పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు ఉన్నప్పటికి డీలర్లు పంపిణీ చేయడం లేదు. తాజాగా పంచదార పంపిణీకి సంబంధించి డీలర్లు వారి కోటా ప్రకారం డీడీలు కట్టాల్సిందేనని వారం క్రితం సర్క్యులర్ జారీ చేశాం. పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత