లోక్సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
ఈనాడు, మహబూబాబాద్: ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గురువారం నుంచి మొదలయ్యే నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.’ అని ఆర్వో తెలిపారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు.. నామపత్రాల స్వీకరణ తదితర అంశాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పోలింగ్ కేంద్రాల పెంపు
లోక్సభ స్థానంలో ప్రస్తుతం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుషులు, 7,83,280 మంది మహిళలు, 105 మంది ఇతరులున్నారు. ఏడు శాసనసభ స్థానాల్లో 1783 పోలింగ్ కేంద్రాలుండగా 30 అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. దీంతో కేంద్రాల సంఖ్య 1813కు పెరిగింది. పోలింగ్కు అవసరమైన ఈవీఎంల కేటాయింపును పూర్తి చేశాం. అవసరమైన మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తైంది.
నాలుగు చోట్ల నాలుగు గంటల వరకే
మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయ ం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్ సిబ్బందికి మొదటి దశ శిక్షణ పూర్తైంది. రెండో దశ కూడా నిర్వహిస్తాం. బందోబస్తు నిర్వహించే పోలీసులతో కలిసి సుమారు 5 వేల మంది విధుల్లో పాల్గొంటారు. మహబూబాబాద్, డోర్నకల్ పరిధిలో 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.
పోస్టల్ బ్యాలెట్లో ఇబ్బందులు రానివ్వం
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్ బ్యాలెట్ అందిస్తాం. ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు హోం ఓటుకు దరఖాస్తు చేసుకుంటే వారందరూ ఇంటి వద్దనే తమ హక్కును వినియోగించుకోవాలి.
సౌకర్యాలకు లోటు రానివ్వం
మే 13న జరిగే పోలింగ్, వేసవిని దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పిస్తాం. కేంద్రాల వద్ద మూత్రశాలలు, తాగునీటి వసతి, విద్యుత్తు సదుపాయం, ర్యాంపుల ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించాం. అన్నింటా తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాం. ఓటర్లు ఎండలో ఇబ్బంది పడకుండా టెంట్లు వేయిస్తాం.
నామపత్రాల దాఖలకు ఏర్పాట్లు
మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థితో కలిసి ఐదుగురిని కార్యాలయంలోకి అనుమతిస్తాం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాల స్వీకరణ ఉంటుంది. మూడు వాహనాలను మాత్రమే లోనికి అనుమతిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లు
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి