icon icon icon
icon icon icon

Chandrababu: ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకూ ప్రభుత్వ పథకాలు: చంద్రబాబు

బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated : 30 Apr 2024 18:48 IST

దెందులూరు: బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ ఇస్తామని, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు.

‘‘చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం. పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తాం. గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూముల కేటాయిస్తాం. ‘గోపాలమిత్ర’ పునర్నియామకం దిశగా చర్యలు చేపడతాం. ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందజేస్తాం. విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ నిర్మిస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌కు ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5 వేలు, హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం.

వ్యవసాయానికి 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌. కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయిస్తాం. కాపు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం. అమరావతిలో ఐదు ఎకరాల్లో అల్లూరి స్మృతివనం ఏర్పాటు చేస్తాం. అగ్రకులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. పేదల గృహనిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయిస్తాం. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులను నియమిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. సైకో పాలన పోయి.. కూటమి పాలన రావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img