పీఆర్సీపై తగ్గేదేలే!
‘ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ 27 శాతం కన్నా అధికంగా ఫిట్మెంట్ ఇవ్వాలి. పాత శ్లాబుల హెచ్ఆర్ఏ కొనసాగించాలి. పీఆర్సీ అయిదేళ్లకొకసారి ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సీపీఎస్ రద్దుపై స్పష్టమైన ఉత్తర్వులివ్వాలి’ అంటూ ఉపాధ్యాయులు గళమెత్తారు. ప్రభుత్వ
కలెక్టరేట్ను ముట్టడించిన వేలాదిమంది ఉపాధ్యాయులు
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
ఉద్రిక్త పరిస్థితుల మధ్య తోపులాటలు... వాగ్వాదాలు
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో నాయకుల అరెస్టు
కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు
‘ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ 27 శాతం కన్నా అధికంగా ఫిట్మెంట్ ఇవ్వాలి. పాత శ్లాబుల హెచ్ఆర్ఏ కొనసాగించాలి. పీఆర్సీ అయిదేళ్లకొకసారి ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సీపీఎస్ రద్దుపై స్పష్టమైన ఉత్తర్వులివ్వాలి’ అంటూ ఉపాధ్యాయులు గళమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలపై తమ వ్యతిరేకతను చాటారు. అర్ధరాత్రి తీసుకొచ్చిన ఏకపక్ష జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, తప్పుడు ప్రకటనలు మానుకుని మెరుగైన పీఆర్సీ అమలయ్యేవిధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. - న్యూస్టుడే, కడప విద్య, జిల్లా సచివాలయం
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ పీఆర్సీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ఉపాధ్యాయులు గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మహావీర్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం మీదుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) రహదారిని పోలీసులు బారికేడ్లతో మూసి వేశారు. కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద రహదారిపైనే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు బైఠాయించి పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజాను పోలీసులు పోలీసుస్టేషన్కు తరలించగా, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కంభం బాలగంగిరెడ్డిని గురువారం ఉదయమే గృహనిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి ఆర్యూపీపీ, ఆర్జేయూపీ, ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్యూఎస్, రూట, ఆపస్, ఏపీపీఈటీ, ఎస్ఏపీఈటీ, పీఆర్టీయూ, ఏపీటీజీ, పీడీ సంఘాల నాయకులు మద్దతు పలికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ సుబ్బారెడ్డి, సెక్రటరీ జనరల్ హరిబాబు, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కొండూరు శ్రీనివాసరాజు, రామకృష్ణమరాజు, ఆర్జేయూపీ రాష్ట్ర నాయకుడు గునిశెట్టి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్రెడ్డి, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్లు జాబీర్, రమణారెడ్డి, అబ్దుల్లా, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్కుమార్, రాష్ట్ర మున్సిపల్ విభాగం కన్వీనర్ రవిశంకర్రెడ్డి, బీటీఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామచంద్ర, వివిధ సంఘాల నాయకులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పింఛనుదారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయినులు
‘ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదు’
ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమం చేస్తున్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఈశ్వరయ్య, చంద్రశేఖర్ పేర్కొన్నారు. పెన్షన్దారులు నష్టపోయే విధంగా ప్రభుత్వం పీఆర్సీ జీవోలు విడుదల చేసిందని, దీంతో ఉద్యోగులలో ఆందోళనలు అధికమై కలెక్టరేట్ల ముట్టడితో మిన్నంటాయన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకుని, మెరుగైన పీఆర్సీ ఇవ్వాలన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం
పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని సరిచేయకపోతే భవిష్యత్తులో మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తాం. ఐఆర్ 27 శాతం కన్నా అధిక శాతంతో ఫిట్మెంట్ ఇవ్వాలి. పాత హెచ్ఆర్ఏ శ్లాబులను యధావిధిగా కొనసాగించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలి. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. - సుబ్బారెడ్డి, జిల్లా ఛైర్మన్, ఫ్యాప్టో
ప్రభుత్వం పునరాలోచన చేయాలి
ఉపాధ్యాయుల ఉద్యమ తీవ్రతను చూసైనా పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. న్యాయంగా రావాల్సిన డీఏలు, ఐఆర్ కొనసాగించాలి. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అయిదేళ్లకొకసారి రావాల్సిన పీఆర్సీని పదేళ్లకు పొడిగించడానికి ప్రభుత్వానికున్న హక్కు ఏమిటి? గత ప్రభుత్వాల హయాంలో పోరాడి సాధించుకున్న పలు సౌలభ్యాలను కోల్పోవడమే 11వ పీఆర్సీ ఉద్దేశమా? రెండేళ్లు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించిన అశుతోష్మిశ్రా నివేదికను బయటకు ఇవ్వడానికి భయమెందుకు? సీపీఎస్ రద్దు హామీ ఏమైంది ? రెండేళ్లకే టైమ్స్కేల్ పొందాల్సిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో 9 నెలలకు వాయిదా వేయడం ధర్మమా ? ఒప్పంద,. పొరుగుసేవల ఉద్యోగులు ఉద్యోగ భద్రతకు ఎంతకాలం ఎదురుచూడాలి? న్యాయంగా రావాల్సిన డీఏలను పీఆర్సీగా చూపించి మభ్యపెట్టడం సమంజసమేనా? ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. - కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ప్రభుత్వ నిరంకుశ ధోరణి సరికాదు
ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం సరికాదు. పీఆర్సీకి సంబంధించి ఏకపక్షంగా జీవోలు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రివర్స్ పీఆర్సీ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాడతాం. బకాయి డీఏలిచ్చి జీతాలు తగ్గవని చెప్పడం హాస్యాస్పదం. ఇది పే రివర్స్ కమిషన్లా ఉంది. పాత శ్లాబుల ప్రకారమే హెచ్ఆర్ఏ కొనసాగించాలి. - జాబీర్, జిల్లా కోఛైర్మన్, ఫ్యాప్టో
స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులను 11వ పీఆర్సీ తీవ్రంగా నిరాశపరిచింది. 17.01.2022న విడుదలైన 1,2,9 జీవోలను పూర్తిగా రద్దు చేయాలి. ఇవి చాలా మోసపూరితంగా ఉన్నాయి. తక్షణమే రద్దు చేసి మెరుగైన పీఆర్సీకి జీవోలివ్వాలి. లేకపోతే ఉద్యమం తీవ్రతరం కాకతప్పదు. ప్రభుత్వం తన నిర్ణయాలపై పునఃసమీక్షించాలని డిమాండు చేస్తున్నాం. - కంభం బాలగంగిరెడ్డి, జిల్లా కోఛైర్మన్, ఫ్యాప్టో
అరెస్టులు అప్రజాస్వామికం
కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడం అప్రజాస్వామికం. ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వేల మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొని విజయవంతం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేయాలని చూడడం సరికాదు. - శ్యామ్సుందర్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్లోకి వెళ్తున్న గురువులు
పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచె వద్ద ఉపాధ్యాయినుల నిరసన
బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న
ఉపాధ్యాయులను అడ్డుకుంటున్న పోలీసులు
ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 29-04-2024]
మండలంలోని బ్రాహ్మణ పల్లెలో సోమవారం సాయంత్రం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, భాజపా, తెదేపా, జనసేన శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
[ 29-04-2024]
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 29-04-2024]
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్