మెజార్టీ తగ్గితే మీ పని చెబుతా!
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల మెజార్టీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని, లేకుంటే మీ పని చెబుతానని వాలంటీర్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి హెచ్చరించారు.
వాలంటీర్లకు ఎమ్మెల్యే రాచమల్లు హెచ్చరిక
ఒక్కొక్కరికీ రూ.5 వేలు వంతున చెల్లింపులు
ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల మెజార్టీ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని, లేకుంటే మీ పని చెబుతానని వాలంటీర్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి హెచ్చరించారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించిన పురపాలక సంఘం కౌన్సిలర్లు వారిని వెంటబెట్టుకుని వైకాపా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం ఇంటింటికెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆయా వార్డుల పరంగా ఓట్ల లెక్కింపు తెలుస్తుందని, మెజార్టీ తగ్గితే మీరు సరిగ్గా పని చేయనట్లేనని తేల్చి చెప్పారు. మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందని, పని చేసినవారిని మాత్రమే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని, లేనివారిని పక్కన పెడతామని హెచ్చరించారు. లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారం సేకరించాలని, వారి ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి వైకాపాకు మద్దతుగా ప్రచారం చేపట్టాలని వాలంటీర్లపై ఎమ్మెల్యే ఒత్తిడి చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున రాజీనామా చేసిన వాలంటీర్లకు ఎమ్మెల్యే అందజేశారు. ఇన్నాళ్లు నిజాయతీగా పని చేసినా ప్రాధాన్యం, గుర్తింపు, విలువ లేకుండా పోయిందని మనసులో కుమిలిపోతూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రాజీనామా చేయాలంటూ కౌన్సిలర్లు రెండు రోజులుగా వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు తమ చరవాణులను సైతం స్విచ్ ఆప్ చేసుకుని ఉండగా ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఒత్తిడి చేస్తున్నారు. మరికొంతమంది వాలంటీర్లు ఊర్లోలేమని చెప్పినా వినకుండా మీ సంతకాలతో మేమే రాజీనామా పత్రాలను అందిస్తామనే నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా 1,569 మంది వాలంటీర్లు ఉండగా, ఇప్పటికే 935 మంది రాజీనామా చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాజీనామాలను పరిశీలించకుండానే అధికారులు ఆమోదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరివి ఫోర్జరీ సంతకాలతో రాజీనామా పత్రాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.