రైళ్ల నిరీక్షణ!
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
అందుబాటులోకి రాని తిరుచానూరు రైల్వేస్టేషన్
నిర్మించిన ప్లాట్ఫామ్
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్టేషన్ అన్ని వసతులు పూర్తి చేసుకున్నా.. ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.
తిరుపతి (రైల్వే), న్యూస్టుడే: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో రైళ్లలో ప్రయాణించే వారే అధికం. రోజుకు 80 నుంచి 90 రైళ్లలో సుమారు 40 వేల మంది వస్తుంటారు. దీంతో స్టేషన్లోని ప్లాట్ఫామ్లపై రైళ్ల నిలుపుదలకు ఆటంకం ఏర్పడుతుండటంతో కూతవేటు దూరంలో కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు తిరుచానూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.
2016-17లో రూ.56.38 కోట్లు మంజూరు చేయగా.. రూ.36 కోట్లతో గుంతకల్ డివిజన్ నిర్మాణ సంస్థ నేతృత్వంలో తిరుచానూరు స్టేషన్ను బీ క్లాస్ స్టేషన్గా అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టింది. మూడు ప్లాట్ఫామ్లు, షెల్టర్లు, ప్ల్లాట్పామ్లపై ప్రయాణికులు వేచి ఉండటానికి బెంచీలు, నీటి సౌకర్యం, ఆహార కేంద్రాలు, వెయిటింగ్ హాళ్లు, సబ్వే, స్టేషన్ మేనేజర్ కార్యాలయం, వీఐపీ లాంజ్, మహిళలకు నిరీక్షణ గదులు, రిజర్వేషన్, బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు పూర్తి చేశారు. విశాలవంతమైన పార్కింగ్తో పాటు టాక్సీస్టాండ్, బస్సులు నిలుపు స్థలం కేటాయించారు.
ప్రారంభిస్తే తీరనున్న సమస్యలు
తిరుపతికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉన్న స్టేషన్లు తిరుపతి, రేణిగుంట. సాధారణంగా తిరుపతికి ఉదయం సమయంలో చేరుకునే రైళ్లు, సాయంత్రం బయలుదేరే రైళ్లు అధికంగా ఉంటాయి. ఆయా సమయాల్లో స్టేషన్ బయట ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందిగా ఉంటోంది. ఈ క్రమంలో తిరుచానూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎంచుకున్న రైలును నిర్దేశిత సమయంలో అందుకోవచ్చు. తిరుపతి- రేణిగుంట మధ్యలో తిరుచానూరు రైల్వేస్టేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు.
షెల్టర్ల నిర్మాణం జరుగుతోంది
ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రెండో ప్లాట్ఫామ్కు షెల్లర్లు లేవు. అందుకోసం ప్రదిపాదనలు పంపాం. అనుమతులు వచ్చాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం స్టేషన్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కె.సత్యనారాయణ, తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 రేవుల్లోనూ.. ఉల్లంఘనలే
[ 23-05-2024]
ప్రకృతి, పర్యావరణ చట్టాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్కే లేదు. ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా మెలిగిన సంస్థలు, వ్యక్తులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, విక్రయాలు చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చుంది. -
అడకత్తెరలో ఆరోగ్యశ్రీ రోగులు
[ 23-05-2024]
ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా గాడితప్పాయి. ఈహెచ్ఎస్ సేవలను నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎప్పుడో ఆపేశారు. -
వెళ్లి రావమ్మా గంగమ్మా..!
[ 23-05-2024]
సకల లోకాలను ఏలే సర్వమంగళి గంగమ్మ తల్లి నిమజ్జన వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి చిత్తూరు నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి. -
సమస్యాత్మక కేంద్రాల్లోనూ..స్వేచ్ఛా పతాకం
[ 23-05-2024]
రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముగ్గురు మంత్రులు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీమంత్రి బరిలో నిలవడం. -
మళ్లీ అధికారంలోకి వస్తే అంతుచూస్తాం
[ 23-05-2024]
మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీఅంతు చూస్తాం.. అంటూ తెదేపా నాయకుడు, కుప్పం పురపాలిక ఐదోవార్డు తంబిగానిపల్లెకు చెందిన కౌన్సిలర్ సెల్వం, మరొకరిపై వైకాపా కార్యకర్తలు దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది. -
గంగమ్మను స్మరించి.. విశ్వరూప దర్శనంతో తరించి
[ 23-05-2024]
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. -
అల్లర్లపై అప్రమత్తం
[ 23-05-2024]
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. -
సర్వదర్శనానికి 15 గంటలు
[ 23-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా బుధవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచిఉన్నారు. -
బిల్లులు ఇచ్చాం.. నిధులు ఇవ్వండి
[ 23-05-2024]
అడ్డగోలుగా తాము చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను తుడా నుంచి విడుదల చేయించుకునే పనిలో పడ్డారు చంద్రగిరి నేతలు. -
నేటి నుంచి ఏనుగుల గణన
[ 23-05-2024]
జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. -
మార్కెట్లో మామిడి కొరత
[ 23-05-2024]
చిత్తూరు మామిళ్ల చిరు విందులంటూ.. సినీ కవుల్ని సైతం ఊరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఆ మామిడికే కొరత వచ్చింది. -
కిక్కిరిసిన ప్రాంగణం.. ప్రయాణికుల అష్టకష్టాలు
[ 23-05-2024]
తిరుపతి కేంద్రీయ బస్టాండ్ బుధవారం ప్రయాణికులు, శ్రీవారి భక్తులతో కిక్కిరిసింది. -
నేటి నుంచి వేరుసెనగ విత్తు పంపిణీ ప్రారంభం
[ 23-05-2024]
జిల్లాలో ఖరీఫ్లో వేరుసెనగ సాగు రైతులకు గురువారం నుంచి రాయితీ వేరుసెనగ విత్తు పంపిణీ ప్రారంభించనున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ బుధవారం తెలిపారు. -
వైకాపాపై వ్యతిరేకత స్పష్టం: చింతామోహన్
[ 23-05-2024]
సజావుగా పోలింగ్ నిర్వహించడంతో పోలీసు శాఖ విఫమైందని చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే అధికార పార్టీకి వత్తాసు పలికారని తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా.చింతామోహన్ విమర్శించారు. -
హత్యచేసి రైలు పట్టాలపై పడేశారు
[ 23-05-2024]
మతాంతర వివాహం నేపథ్యంలో బాలిక బంధువులే తమ కుమారుడ్ని చంపేసి రైలు పట్టాలపై పడేశారని బాధిత తల్లిదండ్రులు మునస్వామి, పార్వతి ఆరోపించారు.