logo

Crime News: ఆరేళ్లలో 1000 మంది యువతులు, మహిళలకు మోసం..

ఆరేళ్లలో 1000 మంది యువతులు, మహిళలను మోసగించిన జోగాడ వంశీకృష్ణ(31)ను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 10 May 2022 07:52 IST


వంశీకృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆరేళ్లలో 1000 మంది యువతులు, మహిళలను మోసగించిన జోగాడ వంశీకృష్ణ(31)ను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ, తెలంగాణలోని అమ్మాయిలే లక్ష్యంగా శ్వేత, మాధురి, గాయత్రి తదితర పేర్లతో నకిలీ సామాజిక ఖాతాలు రూపొందించాడు. వాటి ద్వారా ఉన్నత చదువులు, సంపన్నవర్గాలకు చెందిన యువతులను ఆకట్టుకొని స్నేహం చేసేవాడు. ఉద్యోగాలు, సేవా కార్యక్రమాలు వంటి వాటిని ఆశచూపేవాడు. సుమారు 1000 మంది బాధితులున్నట్లు గుర్తించారు. వివిధ మార్గాల్లో పాల్పడిన మోసాలతో సుమారు రూ.5కోట్ల వరకూ కొట్టేసినట్లు సమాచారం. నిందితుడి కోసం గాలించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులకూ చిక్కకుండా పలుమార్లు తప్పించుకన్నా ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని