కాలుష్యం కాటు... మనుగడకే చేటు
కాసుల కోసం పరిశ్రమలు కానిచ్చేస్తున్న కార్యకలాపాలు ప్రజలపాలిట శాపంలా మారుతున్నాయి. జిప్సం పరిశ్రమల వ్యర్థాలతో నింగి, నేలా, నీరు కలుషితమవుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ప్రజలు అనారోగ్యం
పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న పరిశ్రమలు
ప్రజల గోడు పట్టని అధికారులు
న్యూస్టుడే, తాండూరు గ్రామీణ, పెద్దేముల్
అధికారులకు విన్నవించేందుకు వెళ్తున్న రైతులు
కాసుల కోసం పరిశ్రమలు కానిచ్చేస్తున్న కార్యకలాపాలు ప్రజలపాలిట శాపంలా మారుతున్నాయి. జిప్సం పరిశ్రమల వ్యర్థాలతో నింగి, నేలా, నీరు కలుషితమవుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా అధికారులు పరిశీలించి వెళ్లడమే తప్ప చర్యలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తాండూరు ప్రాంతంలో కొనసాగుతున్న కాలుష్య పరిశ్రమలపై ‘న్యూస్టుడే’ కథనం.
సుద్ద, యాసిడ్ మిశ్రమాలతో వ్యర్థాలు ఇలా..
గుంతలు తవ్వి నిల్వచేస్తున్నారు
జిన్గుర్తి, మిట్టబాస్పల్లి, అంతారం శివార్లలో జిప్సం పరిశ్రమలను నెలకొల్పారు. నియోజకవర్గంలో తాండూరు, యాలాల మండలాలతోపాటు పట్టణ పరిధిలో కొనసాగుతున్న నాపరాయి పరిశ్రమల్లో వెలువడే వ్యర్థ పదార్థం సుద్ద, యాసిడ్ను పరిశ్రమలకు తరలించి జిప్సం తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జిప్సం పరిశ్రమల్లో సుద్ద, యాసిడ్ మిశ్రమాలను ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నేలపై గుంతలు తవ్వి నిల్వ చేస్తున్నారు. నేలలోకి వ్యర్థాలు ఇంకిపోకుండా ఉండేలా హౌసులు నిర్మించి నిల్వ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.
దుర్వాసనతో విద్యార్థులకు అనారోగ్యం
మిట్టబాస్పల్లి పరిధిలోని పరిశ్రమ ద్వారా చుట్టూ 6 కిలోమీటర్ల దాకా భరించలేని చెడు వాసన వస్తుండటంతో పక్కనున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని 400లకుపైగా విద్యార్థినిలు, ఆదర్శ పాఠశాల, కళాశాలలోని 600లకుపైగా విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. చర్మ వ్యాధులు, పంటి నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు.
* అంతారం శివారులోని పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో చెరువులోని చేపలు మృతి చెందడంతోపాటు అటవి భూముల్లో నిర్మించిన ఉద్యానంలో మొక్కలు దెబ్బతిన్నాయి.
విస్తుపోయారు.. పత్తాలేరు..
జిన్గుర్తి వద్ద ఏర్పాటైన పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలతో పంటలు, భూగర్భ జలాలు కలుషితమై ఆరోగ్యం, పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ జిన్గుర్తి గ్రామస్థులు హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. గతనెల 12న విచారణకు వచ్చిన అధికారులు పరిశ్రమలను పరిశీలించి విస్తుపోయారు. మూసి వేయిస్తామంటూ హామీ ఇచ్చారు. నెల దాటినా అధికారులు చేపట్టిన చర్యలు శూన్యం. అంతారం శివారులోని జిప్సం పరిశ్రమ మూసివేయాలంటూ అంతారం, కందనెల్లితండాల రైతులు పలుమార్లు జహీరాబాద్, సంగారెడ్డి రహదారులపై బైఠాయించి ధర్నాలు చేశారు. మిట్టబాస్పల్లి పరిధిలో జిప్సం పరిశ్రమను మూసివేయాలని సర్పంచి నరేందర్రెడ్డి అధ్వర్యంలో రైతులు తాండూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేసి ఫిర్యాదు చేసినా లాభం కనిపించలేదు.
పదికిపైగా బోర్లలో ఎర్రరంగు నీరు: లాల్అహ్మద్, మిట్టబాస్పల్లి
పది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. పక్కనున్న పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు వదలడంతో పంట దిగుబడులు దెబ్బతింటున్నాయి. నా బోరుతోపాటు చుట్టుపక్కల పొలాల్లోని పదికిపైగా బోర్లలో ఎర్రరంగులో నీరు వస్తోంది.
త్వరలో చర్యలు చేపడతాం: వెంకన్న, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి
జిప్సం పరిశ్రమల నుంచి సేకరించిన నమూనాల ప్రయోగ ఫలితాల నివేదిక వచ్చింది. 16వ తేదీ తర్వాత సమావేశం ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమలపై చర్యలకు నిర్ణయం తీసుకుంటారు. కాలుష్యం వెదజల్లే, నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరద కదలక.. దారి వదలక
[ 21-05-2024]
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
వీడియోలు చూసి.. చోరీ చేసి
[ 21-05-2024]
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
విద్యా ప్రమాణాలు.. ఉపాధికి అవకాశాలు
[ 21-05-2024]
విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్ (నేషనల్ అసెస్మెంట్, అక్రిడేషన్ కౌన్సిల్)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. -
అనుమతి అడిగితే.. డబ్బులడిగారు!
[ 21-05-2024]
కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు అనిశా వలకు చిక్కారు. -
తాగునీటికి ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. -
గుర్రపు పందేలపై బెట్టింగ్లు.. ఆరుగురి అరెస్ట్
[ 21-05-2024]
గుర్రపు పందేలు కాస్తూ.. బైక్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. -
బోటు షికారు.. పోటెత్తిన హుషారు
[ 21-05-2024]
అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి. -
కోడ్ ముగిసిన వెంటనే కొత్త ఎస్టీపీలకు టెండర్లు
[ 21-05-2024]
ఔటర్ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది. -
హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని
[ 21-05-2024]
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. -
వరదతో కలిసి.. మురుగు తిష్ఠవేసి
[ 21-05-2024]
నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది. -
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
[ 21-05-2024]
నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. -
జేఎన్జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు
[ 21-05-2024]
ఈసెట్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ వినయ్కుమార్ తెలిపారు. -
సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయాలు
[ 21-05-2024]
జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ఆధ్యాత్మికతకు పట్టం కట్టేలా అక్షరాలు
[ 21-05-2024]
త్యాగరాయ గానసభ నిర్వహణలో ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం...వీరం’ గ్రంథావిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్