కార్మికుల అవసరాలే మా ప్రాధాన్యం
‘చట్టాలు కార్మికులకు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. వందమంది కార్మికులుంటే ఆ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం.
‘తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి’తో ఆర్థిక సాయం
కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్సుందర్ జాజుతో ‘ఈనాడు’ ముఖాముఖి
- ఈనాడు, హైదరాబాద్
‘చట్టాలు కార్మికులకు అనుకూలంగానే ఉంటాయి. చాలామందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. వందమంది కార్మికులుంటే ఆ సంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి కార్యాలయంలో కార్మికుల ప్రయోజనాధికారులు ఉండేలా చూస్తున్నాం. ‘తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి’ ఏర్పాటు చేసి అందులో రూ.7తో సభ్యులుగా చేరితే కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. కార్మికులకు సందేహాలుంటే 040-27634045 నంబరులో సంప్రదించవచ్చు..labour.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తులుంటాయని అంటున్న కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ జాజుతో ‘ఈనాడు’ ముఖాముఖి.
ప్రశ్న: శుభకార్యాలున్నప్పుడు, ఇతర కుటుంబ అవసరాలకు ఈ పథకం ద్వారా ఏమైనా భరోసా లభిస్తుందా?
సమాధానం: కార్మికుని కుమార్తె (కుటుంబంలో ఒక్కరికే), మహిళా కార్మికురాలి వివాహ సందర్భంగా రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందజేస్తారు. సంక్షేమ నిధి సభ్యులుగా మూడేళ్లు ఉండాలి. ప్రసూతి సహాయం కూడా కార్మికురాలికి, కార్మికుని భార్యకు రూ.5వేలు (ఇద్దరు పిల్లలకు మాత్రమే) అందుతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి రూ.2 వేలు అందజేస్తారు. కార్మికుని నెలవారీ వేతనం రూ.16వేలు మించరాదు.
ప్రశ్న: కార్మికుల పిల్లల చదువులకు అండగా నిలుస్తారా?
సమాధానం: ప్రతిభ ఆధారంగా వారికి ఉపకార వేతనం అందుతుంది. పదో తరగతి, ఐటీఐ విద్యార్థికి రూ.వెయ్యి, పాలిటెక్నిక్ విద్యార్థికి రూ.1500 అందజేస్తారు. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, అగ్రికల్చర్, హార్టీకల్చర్ బీఎస్సీ, బీఏఎంఎస్, బీడీఎస్, డీఎంఎల్టీ, ఎంఎల్ఐటీ, బీవీఎస్సీ, బీఫార్మసీ, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, డీహెంఎస్ చదువుతున్న విద్యార్థులకు రూ.2 వేలు ఏడాదిలో అందజేస్తారు. జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగులైన విద్యార్థులకు ప్రత్యేక విద్యా ప్రోత్సాహకం కింద రూ.4 వేలు ఉపకార వేతనం అందజేస్తారు.
ప్రశ్న: కార్మికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే సంక్షేమ మండలి ద్వారా అందే సాయం ఎలా?
సమాధానం: క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ ట్యూమర్, గుండె జబ్బు, పక్షవాతం, ఎయిడ్స్, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్(ప్రమాదాల్లో గాయాలకు చికిత్స) ఇలా పలు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రూ.20,000 వరకూ ఆర్థిక సాయం అందుతుంది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న కార్మికులకు, యాజమాన్యం ద్వారా వైద్య సహాయం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు.
ప్రశ్న: ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత ఆర్థిక సాయం అందుతుంది?
సమాధానం: ఈ పథకం కింద రూ.30 వేలు చెల్లిస్తారు. సహజ మరణం అయితే రూ.10వేలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.20 వేలు సహాయం అందుతుంది. అంత్యక్రియలకు రూ. 5వేలు ఇస్తారు. అంగవైకల్యం 25 శాతం ఉంటే రూ.10వేలు, 41 శాతం నుంచి 49 శాతం వరకూ ఉంటే రూ. 15వేలు, 50శాతం పైన ఉంటే రూ.20 వేలు అందజేస్తారు.
ప్రశ్న: కార్మికుల కుటుంబ సంక్షేమానికి ఏం చేస్తున్నారు?
సమాధానం: కార్మికుల కుటుంబ సభ్యుల ఆదాయాన్ని పెంచడానికి కుట్టుపని, ఎంబ్రాయిడరీ ఇలా చేతి వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తాం. అలాగే క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఏటా క్రీడోత్సవాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
[ 20-05-2024]
కిర్గిజ్స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్లోని భారత రాయబారితో మాట్లాడారు. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
[ 20-05-2024]
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
[ 20-05-2024]
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
[ 20-05-2024]
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
[ 20-05-2024]
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ