logo

తేలికగా దాటొచ్చని.. దొరికిపోయారు

పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతరాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్‌ జాతీయ రహదారిపై శంషాబాద్‌ ఎస్‌వోటీ,

Published : 18 Jan 2022 02:24 IST

నిందితులు, సరకుతో అధికారులు, సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌  కొత్తూరు, న్యూస్‌టుడే: పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతరాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్‌ జాతీయ రహదారిపై శంషాబాద్‌ ఎస్‌వోటీ, కొత్తూరు పోలీసులు సంయుక్త తనిఖీల్లో 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన బాబా సౌ చందేకర్‌(45), పుక్మలి తిరుమలి బాలు(39), గణేష్‌ నొలారి(39), రాజేంద్ర(45), సూర్యాపేట నివాసి మాలోత్‌ వినోద్‌(28)ను అరెస్ట్‌ చేశారు. ప్రధాన సరఫరాదారులు రవి, నాగరాజు, బాల్‌రాజ్‌, గణేష్‌, రాథోడ్‌ రవి పరారయ్యారు. సోమవారం షాద్‌నగర్‌ ఏసీపీ కుశల్కర్‌, ఇన్‌స్పెక్టర్లు వెంకటరెడ్డి, శ్రీధర్‌ భూపాల్‌తో కలిసి కొత్తూరు పోలీసుస్టేషన్‌లో శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడు బాబా సౌ చందేకర్‌, రాజేంద్రతో కలసి గంజాయి రవాణా సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం 250 కిలోల గంజాయి కావాలంటూ చందేకర్‌, రాజేంద్రలు గణేశ్‌ అనే దళారిని సంప్రదించారు. రవి ఏపీలోని సీలేరు అటవీ ప్రాంతంలో సరకు కొనుగోలు చేశాడు. సరుకు చేరవేసేందుకు ఇద్దరు సాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున తిమ్మాపూర్‌ చేరుకున్నారు. సరుకును మరో వాహనంలోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని