icon icon icon
icon icon icon

Chandrababu: పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు: చంద్రబాబు

కేసుల పేరుతో తెదేపా నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని విమర్శించారు.

Updated : 22 Apr 2024 17:53 IST

జగ్గంపేట: కేసుల పేరుతో తెదేపా నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.  చిన్న టీ కొట్టులోనూ ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంటే.. మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న సీఎం జగన్‌.. ఆడిన మాట నిలబెట్టుకున్నారా?అని ప్రశ్నించారు.

‘‘సీపీఎస్‌ రద్దు చేస్తా అన్నారు.. చేశారా? జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. మెగా డీఎస్సీ వేస్తా అన్నారు... వేశారా? మా హయాంలో కరెంట్‌ ఛార్జీలు పెరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డీఎస్సీ పైనే. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశాం. మహిళలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. మేం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ వచ్చి రూ.4 వేలు పింఛను ఇస్తాం. మా హయాంలో అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టాం. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తాం. మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తాం. యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఎవరివల్ల బాగుంటామో ప్రజలంతా లెక్కలు వేసుకొని ఓటు వేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img