icon icon icon
icon icon icon

Chandrababu: మూడు రాజధానుల పేరుతో అమరావతి సర్వనాశనం: చంద్రబాబు

మూడు రాజధానుల పేరుతో అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 30 Apr 2024 22:39 IST

తెనాలి: మూడు రాజధానుల పేరుతో అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే శివకుమార్‌ పన్నుల రూపంలో ప్రజల నుంచి ఇష్టారీతిన దోచేస్తున్నారని మండిపడ్డారు.‘‘ఒకప్పుడు ఈ ఆంధ్రా ప్యారిస్‌ (తెనాలి) అమరావతిలో భాగం. రాజధాని అభివృద్ధి ఉంటే.. ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగేది. తిక్కలోడు వచ్చి, మూడు రాజధానులని చెప్పాడు. చివరికి రాజధాని లేకుండా చేశాడు. అలాంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో ఓడించి మళ్లీ రాష్ట్రాన్ని పునర్మించుకోవాలి ’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img