ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు
యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి 27 శాతానికి మించి ఓటు బలం ఉన్నా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అని ఆలోచించానని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.
‘పరదాల మహారాణి’ని సాగనంపే సమయం ఆసన్నమైంది
ఎన్డీయే అధికారంలోకి రావడం.. వైకాపా గూండాల తాటతీయడం ఖాయం
పదేళ్లుగా బెయిల్పై ఉన్న వ్యక్తి యువతకు న్యాయం చేస్తారా?
వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్
‘ఏంటమ్మా.. పరదాల మహారాణి.. కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టారట. విద్యార్థులూ జాగ్రత్త. కక్ష పెట్టుకుంటారు. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతుంటారు. ఆమె వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. యువతరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది.’
జగన్ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్య
‘ఈ మధ్య వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో మోదీ, చంద్రబాబు, నా ఫొటోలు పెడుతూ.. వీళ్లు వస్తే చర్చిలకు ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. నా భార్య క్రిస్టియన్. నచ్చిన మతం తీసుకోమని నా బిడ్డలకు స్వేచ్ఛ ఇచ్చా. చర్చికి వెళ్లి హిందూధర్మాన్ని.. తిరుమల, మసీదుకు వెళ్లి అన్యమత ప్రచారం తప్పుకదా? ఇదే విషయాన్ని చెప్పాను తప్ప.. నేనెప్పుడూ క్రైస్తవాన్ని ఖండించలేదు’
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సభలో జనసేనాని పవన్కల్యాణ్
ఈనాడు, రాజమహేంద్రవరం: యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి 27 శాతానికి మించి ఓటు బలం ఉన్నా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అని ఆలోచించానని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. వైకాపా ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శనివారం జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెదేపా ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో కలిసి పవన్ పాల్గొన్నారు. ‘మీపై చిన్న కేసున్నా పాస్పోర్టు, ఉద్యోగం ఏదీ రాదు. అలాంటిది మీ భవిష్యత్తు నిర్దేశించే వ్యక్తి.. ఖైదీ నంబరు 6093గా 16 నెలలు చిప్పకూడు తిని, పదేళ్లుగా బెయిల్పై ఉన్నారు. ఆయన యువతకు న్యాయం చేస్తారా’ అని పవన్ ప్రశ్నించారు. ‘జగన్.. మేం వచ్చాక.. నీవు కోరుకున్న చోట వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ను ప్రధానితో చెప్పి ఏర్పాటు చేయిస్తా’ అని పేర్కొన్నారు. జగన్ను ‘మోదీ గ్యారంటీ’తో జైలుకు పంపించడం ఖాయమన్నారు. ఎన్డీయే అధికారంలోకి రావడం.వైకాపా గూండాల తాటతీయడం తప్పదన్నారు.
నన్ను తిట్టడానికే కాపు ఎమ్మెల్యేలు..
‘కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా జక్కంపూడి రాజాను నియమించారు. కొత్తగా ఇచ్చే నిధులను పక్కన పెడితే, ఉన్నవాటిని మళ్లించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పిన జగన్, 2014-19లో చంద్రబాబు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇస్తే వైకాపా వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తే నిత్యం నన్ను తిట్టే కాపు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పటికీ కాపు వర్గం జగన్వైపే ఉంటారనుకుంటే ఎంత వరకు సమంజసమో ఆలోచించండి. దామాషా ప్రకారం వెనుకబడిన కాపులకు ఎందుకు ఈబీసీ ఇవ్వలేదో జగన్ చెప్పాలి’ అని పవన్ నిలదీశారు.
అక్రమాలకు రాజధానిగా రాజానగరం
‘వైకాపా ఎమ్మెల్యేల్లో నా అభిమానులున్నా.. వారివల్ల సమాజానికి విఘాతం కలిగితే రాజకీయంగా విభేదిస్తానని పవన్కల్యాణ్ పేర్కొన్నారు. రాజానగరం అనగానే గంజాయి వ్యాపారం, మూడు పెద్ద ఇళ్లు తీసుకుని బెట్టింగ్ నిర్వహణ, బ్లేడ్బ్యాచ్ దోపిడీలను ఓ పెద్ద కుటుంబం (జక్కంపూడి కుటుంబం) నుంచి వచ్చిన వాళ్లు చేస్తుండటం బాధ కలిగించింది. వేరే వ్యక్తులు స్థిరాస్తి వ్యాపారం చేస్తే 15 శాతం కమీషన్ ఇవ్వాలట. నన్నయ వీసీ పదవికి సైతం రూ.కోట్లు తీసుకున్నారు. కార్మిక నాయకుడిగా ప్రజలకు అండగా నిలిచిన జక్కంపూడి రామ్మోహనరావు బిడ్డలు ఈ రోజున ఇసుక, భవననిర్మాణ కార్మికుల పొట్టకొడుతున్నారు’ అని ఆరోపించారు. కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణను గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
తోట త్రిమూర్తులు 28 ఏళ్ల క్రితం దళితులకు శిరోముండనం చేయిస్తే.. రాజానగరంలో ఇటీవలే జరిగిందన్నారు. ఇది అనైతికమని, ఇలాంటి అరాచకాలు పోవాలంటే ఇక్కడ జనసేన గెలవాలన్నారు.
నన్ను తిడితే కోపం రాదు..
జగన్ తనను ఎక్కువ తిడుతున్నారని, అయినా తనకు కోపం రాదన్నారు. దళిత డ్రైవర్ను చంపి, డోర్ డెలివరీ చేస్తే చాలా కోపం వచ్చిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలాంటోడు ఏదైనా తప్పు చేస్తే.. మీకు కత్తి ఇస్తాను. తల నరికేయండి’ అని జనసేనాని అన్నారు. ‘ఇక్కడ మాట్లాడుతుండగా నాకు ఒక మూట(తువ్వాలుతో చుట్టినది) తగిలింది.. అందులో ఏం పెట్టారో తెలియదు. జగన్లా పెద్ద గంత కట్టుకుని నాటకాలు చేయను, భరిస్తా’ అని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించాలన్నారు. ఆమె గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్నారు. గోదావరి ప్రక్షాళన చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు.
అజాత శత్రువు చిరంజీవిని అవమానించారు..
‘నేను గతంలో తెదేపాతో విభేదించినా..నా సినిమాల విషయంలో ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. కానీ జగన్.. ఆ రోజు చిరంజీవి, ప్రభాస్, మహేష్ వెళ్తే ఇంటి బయట నుంచి నడిపించి కనీసం భోజనం పెట్టలేదు. సినిమా టికెట్ ధరలు పెంచాలి.. అంటే నిర్మాతల మండలి ఉంది. కానీ ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చి చిరంజీవి అందరి తరఫునా మాట్లాడితే ఆయన్ను అవమానించారు. అజాత శత్రువు చిరంజీవి.. ఎన్ని విమర్శించినా ఏమీ అనని వ్యక్తిని జగన్ కించపరిచారు’ అని పవన్ మండిపడ్డారు.
వైకాపా పాలనలో తలలేని మొండెంలా రాష్ట్రం : పురందేశ్వరి
అయిదేళ్ల వైకాపా పాలనలో తలలేని మొండెంలా రాష్ట్రం తయారైందని, రాజధాని లేని రాష్ట్రమని అంతా హేళన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జగన్ నిత్యం ఇంట్లో ఫ్యాన్ ఉండాలని అంటారని.. కానీ ఫ్యాన్ స్పీడ్ 1 నుంచి 4లోపు ఉండాలని, మనం 151 స్పీడ్ పెంచడంతో ఆ గాలికి ఇళ్లు కూలిపోవడంతో మనకు శిథిలాలే మిగిలాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్