చంద్రబాబు ఇంట్లో నేతల సందడి
తెలుగుదేశం తరఫున లోక్సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంల పంపిణీ ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సందడిగా సాగింది.
బీఫాంలు అందుకోవడానికి తరలివచ్చిన అభ్యర్థులు
అందరితో కలిసి భోజనం చేసిన అధినేత
హాజరుకాని 14 మంది అభ్యర్థులు
తంబళ్లపల్లె, దెందులూరు అభ్యర్థులకు అందని ఆహ్వానం
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం తరఫున లోక్సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంల పంపిణీ ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సందడిగా సాగింది. అభ్యర్థులంతా తమ అనుచరులతో కలిసి వాహనాల్లో ఒకేసారి తరలిరావడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. బీఫాంలు అందజేసిన తర్వాత చంద్రబాబు వారందరితో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు వివిధ కారణాలతో హాజరు కాలేదు. ఇందులో తంబళ్లపల్లె, దెందులూరు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫాంల పంపిణీని పార్టీ పెండింగ్లో పెట్టింది. దీంతో అక్కడ అభ్యర్థులుగా ప్రకటించిన జయచంద్రారెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఉండవల్లికి రాలేదు. అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయమై కొలిక్కివస్తే.. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫాంల పంపిణీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనపర్తి స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. అక్కడ నుంచి తెదేపా తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తుండటంతో కొంత గందరగోళం నెలకొంది. అనపర్తి సీటు తెదేపా తీసుకుంటే.. తంబళ్లపల్లె, దెందులూరుల్లో ఒకటి భాజపాకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దెందులూరు నుంచి తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేయనున్నట్లు చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. మరో 12 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా బీఫాంల పంపిణీ కార్యక్రమానికి రాలేదు. వీరిలో ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్ల్లి, తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలు, మరికొందరు దూరాభారం అవుతుందని చెప్పినట్లు తెలిసింది. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి తరఫున ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి బీఫాంలు అందుకున్నారు.
మీకు టికెట్.. తెదేపాలో కార్యకర్తకిచ్చే గౌరవం
తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకూ లోక్సభకు వెళ్లే స్థాయి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు బీఫాం తీసుకునే సందర్భంలో చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేశారు. ‘మీకిచ్చిన సీటు.. పార్టీలో సామాన్య కార్యకర్తకు లభించే గౌరవం. కష్టపడి పనిచేయండి. మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు’ అని చంద్రబాబు ఆయన్ను అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు