icon icon icon
icon icon icon

9 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్‌ పార్టీ 9 మంది అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించింది.

Published : 22 Apr 2024 05:12 IST

రాష్ట్రంలో మొత్తం 23 లోక్‌సభ స్థానాలకు పోటీ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్‌ పార్టీ 9 మంది అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించింది. ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 23 లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. రాష్ట్రంలోని మిగిలిన రెండుస్థానాల్లో ఇండియా కూటమిలో భాగంగా అరకు స్థానంలో సీపీఎం, గుంటూరు నుంచి సీపీఐ పోటీచేయనున్నాయి. తాజా జాబితా ప్రకారం శ్రీకాకుళం నుంచి డాక్టర్‌ పి.పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం- జంగా గౌతమ్‌, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్‌, ఒంగోలు-ఇ.సుధాకరరెడ్డి, నంద్యాల-జంగిటి లక్ష్మి నరసింహయాదవ్‌, అనంతపురం- మల్లికార్జున్‌ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్‌షహీన్‌ పోటీ చేయనున్నారు. వీటితోపాటు ఝార్ఖండ్‌లోని రెండు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 295 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img