icon icon icon
icon icon icon

మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాటల్ని సమర్థిస్తారా?

‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తి మీద రూపాయి పెడితే, అయిదు పైసల విలువ చేయదు’ అంటూ వ్యాఖ్యానించిన వైకాపా నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాటల్ని సమర్థిస్తారా? అని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

Published : 22 Apr 2024 05:50 IST

సీఎం జగన్‌ను ప్రశ్నించిన తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తి మీద రూపాయి పెడితే, అయిదు పైసల విలువ చేయదు’ అంటూ వ్యాఖ్యానించిన వైకాపా నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాటల్ని సమర్థిస్తారా? అని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ఉండే కుల అహంకారం.. వైకాపాలో ఉండే నేతలందరికీ ఉందని ఎక్స్‌ వేదికగా ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీలో ఇలాంటి నాయకులను పెట్టుకొని సామాజిక న్యాయం గురించి జగన్‌ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

దర్శి నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రహదారి ప్రమాదంలో గాయపడటంపై లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img