icon icon icon
icon icon icon

టికెట్‌ దక్కలేదనే పోతిన మహేష్‌ విమర్శలు

ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదన్న అసూయతోనే పోతిన మహేష్‌.. పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ మండిపడ్డారు.

Published : 22 Apr 2024 05:51 IST

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎమ్మెల్యే టికెట్‌ దక్కలేదన్న అసూయతోనే పోతిన మహేష్‌.. పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘వాస్తవాలు వక్రీకరించేలా మహేష్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీ అభివృద్ధికి కృషి చేయకున్నా.. విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సముచిత స్థానమిచ్చి గౌరవించాం. పొత్తులు ఉండాలని నాడు కోరిన వ్యక్తి.. టికెట్‌ రానంత మాత్రాన పొత్తును వ్యతిరేకించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు షేక్‌ సలాంపై.. వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన అనుచరులు చేసిన దాడిని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ ఓ ప్రకటనలో ఖండించారు. ఈ ఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img