icon icon icon
icon icon icon

కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున తాను పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు.

Published : 23 Apr 2024 05:48 IST

సీఈవోకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున తాను పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలోని తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని గుర్తు చేశారు. కోడ్‌ అమల్లో ఉన్నా కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు కుప్పంలో అదనపు భద్రతా బలగాల్ని మోహరించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌మీనాకు సోమవారం ఆయన లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img