icon icon icon
icon icon icon

38 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మరో జాబితా

Published : 23 Apr 2024 05:50 IST

ఇప్పటికే ప్రకటించిన పది స్థానాల్లో మార్పులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాసనసభ స్థానాలకు సంబంధించి 38 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ప్రకటించింది. ఇందులో పది స్థానాలకు ఇంతకుముందు ప్రకటించిన వారిని మార్చి, వేరొకరికి టికెట్లు కేటాయించింది. 28 స్థానాల్లో కొత్తవారిని ఖరారు చేసింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ చీరాల నుంచి బరిలో దిగనున్నారు. తాజా జాబితాతో ఇప్పటివరకు ఆ పార్టీ 142 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఇండియా కూటమిలో భాగంగా మరో 16 స్థానాల్లో సీపీఎం, సీపీఐలకు మద్దతు ప్రకటించింది. ఇంకా 17 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img