icon icon icon
icon icon icon

మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌ శక్తి.. కలిసే కూటమి

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనతో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Updated : 23 Apr 2024 07:04 IST

దగ్గుబాటి పురందేశ్వరి

నిడదవోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనతో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, యువత, రైతులు ఎవరికీ భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌కల్యాణ్‌ శక్తి.. కలిసే కూటమి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రహదారులన్నీ గుంతలు పడి ఉన్నాయన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఒక పరిశ్రమ కూడా లేదని, నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలో పుట్టిన రోజులు వేడుకలు చేసుకున్నారు. గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కేకును కోశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img