icon icon icon
icon icon icon

వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం

రాష్ట్రంలో ఎన్టీయే కూటమి అభ్యర్థులను గెలిపించి, మోసపూరిత వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ పిలుపునిచ్చారు.

Published : 24 Apr 2024 05:38 IST

కేంద్ర మంత్రి వీకే సింగ్‌ పిలుపు

ధర్మవరం/పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్టీయే కూటమి అభ్యర్థులను గెలిపించి, మోసపూరిత వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో భాజపా, తెదేపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారికి సత్యకుమార్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అనంతరం వీకే సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రధాని మోదీతో మాట్లాడి టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సత్యకుమార్‌ మాట్లాడుతూ గ్రామాల్లో కూటమి నాయకులకు వస్తున్న స్పందన చూసి వైకాపాకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img