రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం
దేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం సూపర్-6 పథకాలతో కలిపి మొత్తం పది భరోసాలు అమలు చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.
అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు
నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
వాలంటీర్లకు రూ.10 వేల జీతం
ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇస్తాం
ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు.. మెరుగైన పీఆర్సీ
సూపర్-6 పథకాలకు అదనంగా నాలుగు అమలు చేస్తాం
పాతపట్నం, ఆమదాలవలస ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ఈనాడు డిజిటల్ - శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస గ్రామీణం, ఆమదాలవలస పట్టణం, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం సూపర్-6 పథకాలతో కలిపి మొత్తం పది భరోసాలు అమలు చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఆమదాలవలసల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం తగ్గిపోయింది. జీవన ప్రమాణాలు పడిపోయాయి. ముఖ్యమంత్రికి అహంకారం నెత్తికెక్కింది. చుక్కల భూములను దోచేశారు. ప్రజల భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవడం సైకోయిజమే. మేం అధికారంలోకి రాగానే భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. పంటల బీమా మళ్లీ తీసుకువస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కి ఇస్తాం. ఉద్యాన పంటలు, బిందు, తుంపర సేద్యాన్ని పునరుద్ధరిస్తాం. రాయితీపై ట్రాక్టర్లు, యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తాం’ అని అన్నదాతలకు హామీలు ఇచ్చారు.
చెత్త పన్ను రద్దు చేస్తాం
- భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదు. కుదిరితే ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచే ఛార్జీలు తగ్గిస్తాం.
- చెత్త పన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నులు నియంత్రిస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను నియంత్రిస్తాం. మీపై భారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాం.
ప్రాణాలు తీస్తున్న ‘జే’ బ్రాండ్లు లేకుండా చేస్తాం
జగన్ అధికారంలోకి వచ్చాక మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకొని రూ.60 ఉన్న క్వార్టర్ మద్యాన్ని రూ.200 చేశారు. నాణ్యత లేని మద్యం తయారు చేస్తూ వేల మంది ప్రాణాలు తీస్తున్నారు. డబ్బుల కక్కుర్తితో మహిళల పుస్తెలు తెంచారు. మద్యం దుకాణాల్లో మాత్రం నగదు తీసుకుని తాడేపల్లికి తరలిస్తున్నారు. జగన్ మద్యనిషేధం అని మోసం చేశారు. నేను అలా మాయమాటలు చెప్పను. మద్యం దోపిడీ నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాం. ధరలను నియంత్రిస్తాం. మీ ప్రాణాలు తీస్తున్న ‘జే’ బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేస్తాం.
- దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తాం. మన రాష్ట్రంలోనే ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ సంస్థలు వచ్చేలా చేస్తాం.
- ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం.
- ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
- వర్క్ ఫ్రం హోం సదుపాయంతో స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం.
- స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందిస్తాం.
- కేంద్రం ఇళ్ల కోసం రూ.1.50 లక్షలు ఇస్తుంటే జగన్ దానికి రూ.30 వేలు కలిపి, అంతా ఆయనే ఇచ్చినట్లు హడావుడి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు తీసుకున్న వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. అందరికీ రెండు సెంట్ల స్థలమిచ్చి, ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం.
- వాలంటీర్ల జీతాలు రూ.10 వేలు చేస్తాం.
పింఛను తొలగించం
- రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ఆంక్షలు లేకుండా చేస్తాం. పింఛను రూ.4 వేలు చేసి మీ ఇంటి వద్దే అందిస్తాం. ఒకటి, రెండు నెలలు తీసుకోకపోయినా.. అన్నీ కలిపి ఆ తర్వాత నెలలో అందజేస్తాం.
- కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటిందని, మీ అబ్బాయికి కారు ఉందని పింఛన్లు తీసెయ్యం.
- వికలాంగులకు రూ.6 వేల పింఛను ఇస్తాం. బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం
- ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం.
- ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పింఛనుదారులను అన్ని విధాలా ఆదుకుంటాం.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
- నాగావళి, వంశధార, కృష్ణా, గోదావరి, పెన్నా నదుల్ని అనుసంధానిస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరందించవచ్చు. అది నా కల.
ధ్వంసమైపోయిన రోడ్లు బాగు చేస్తాం..
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క కొత్త రోడ్డూ వేయలేదు. ఉన్న రోడ్లను బాగు చేసే దిక్కు లేదు. ఈ పరిస్థితిని మారుస్తాం. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో రోడ్ల బాగుపై దృష్టిపెడతాం.
సభాపతిని ప్రజాకోర్టులో శిక్షిస్తాం
సైకో మాటలకు తలూపి తమ్మినేని సీతారామ్ స్పీకర్ స్థానాన్ని అప్రతిష్ఠపాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మనం కొట్టే దెబ్బకు ఆయన ఎక్కడికి పోయినా పట్టుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షిస్తామని ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు