జగన్ దగ్గరున్న రూ. లక్ష కోట్లు ప్రజలవే
‘ఒకప్పుడు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందంటూ జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. అలాంటి వ్యక్తి తనయుడైన జగన్ దగ్గర ఇప్పుడు రూ. లక్ష కోట్లు ఉన్నాయంటే అవన్నీ ప్రజల సొమ్ములే’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
రూ. 930 కోట్ల జనం సొమ్ము సాక్షికి మళ్లించారు
ఉప్పాడ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
‘‘సింహాలు సింగిల్గా వస్తాయంటూ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జలా! మనం ఉన్నది జంతు ప్రపంచంలో కాదు. మానవ ప్రపంచంలో. మీరు చిరంజీవి జోలికి రాకండి. ఆయన పద్మ విభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడితే ఆయన్నీ తిడతారు. చిరంజీవినీ తిడతారు. అందరూ మీ పల్లకీలు మోయరు. ప్రజల్ని పల్లకీలు ఎక్కించి మేం బోయీలుగా వెళ్తున్నాం. చిరంజీవి గురించి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నేను గూండాల్లా మాట్లాడిన చాలామందిని చూసి వచ్చాను.
ఉప్పాడ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ధ్వజం
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కొత్తపల్లి: ‘ఒకప్పుడు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందంటూ జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. అలాంటి వ్యక్తి తనయుడైన జగన్ దగ్గర ఇప్పుడు రూ. లక్ష కోట్లు ఉన్నాయంటే అవన్నీ ప్రజల సొమ్ములే’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ‘బ్యాంకుల్లో ఉన్నది మన డబ్బు. బ్యాంకు మేనేజర్, ఛైర్మన్ దానికి కాపలాదారులు. కానీ వాళ్లు ఆ సొమ్మును తమ ఇష్టానుసారం ఖర్చుపెడతామంటే మనం ఊరుకుంటామా? అలాంటిది ఒక ముఖ్యమంత్రి మనందరి కష్టాన్ని, మనం కట్టిన పన్నుల డబ్బును సాక్షి పత్రిక కోసం ఖర్చుపెట్టారు. ఒక్కో వాలంటీరుకు రూ. 200 చొప్పున నెలనెలా ఇచ్చి ఆ పత్రికను కొనాలన్నారు. అలా ఈ ఐదేళ్లలో రూ. 330 కోట్లు వెచ్చించారు. ఆ డబ్బుతో ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మించుంటే 20 వేలమందికి ఉపాధి దక్కేది. సాక్షి పేపర్ కొనిపిస్తున్న డబ్బులు జగన్వి కాదు. మీ డబ్బులు. మీ కష్టం. రూ. 420 కోట్లు పెట్టి ఫిషింగ్ హార్బర్ నిర్మించండని మత్స్యకారులు కోరితే పట్టించుకోకుండా సాక్షి పేపర్కు జనం సొమ్ము మళ్లించారు. 41 మంది సాక్షి ఉద్యోగులను పీఆర్వోలుగా, మీడియా మేనేజర్లుగా పెట్టుకుని దానికి కొంత డబ్బు వృథా చేశారు. ఆ పత్రికలో యాడ్ల కోసం రూ. 600 కోట్లు. ఇలా కళ్లముందే రూ. 930 కోట్లు సాక్షికి వెళ్లిపోయాయి’ అని పవన్ ధ్వజమెత్తారు. ‘జగన్ ఎన్నో కేసుల్లో పదేళ్లుగా బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివ్యక్తి. చెల్లెలి వ్యక్తిగత జీవితాన్ని తన మనుషులతో సోషల్ మీడియాతో తిట్టించారు. రేప్పొద్దున్న మీ జోలికి రారని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 30 వేల పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. మనవాళ్లు కాదని అనుకోవద్దు. చంద్రబాబు సతీమణిని తిడితే మన ఇంట్లో ఆమె కాదని అనుకోవద్దు. అలా అనుకోబట్టే సొంత చెల్లి షర్మిలను తిట్టే స్థాయికి వచ్చారు. మళ్లీ ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని కోరారు. నా మీద ఎవరినైనా పోటీ పెట్టొచ్చు.. వంగా గీతనైనా పోటీ పెట్టొచ్చు.. కానీ నా పోటీ మాత్రం జగన్తోనే’ అని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలని, నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలని అనుకునేలా పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
సెజ్ సమస్యే రాజకీయాల్లోకి రమ్మంది
రాజకీయాల్లో పోరాడాలనే కోరికకు ఎస్ఈజెడ్ కారణమని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘రాజశేఖరరెడ్డి ఎస్ఈజెడ్ ప్రారంభించారు. కాకినాడ సెజ్లో పరిశ్రమలు స్థాపిస్తాం. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని 2009లో 10 వేల ఎకరాలు తీసుకున్నారు. రైతులను రోడ్డున పడేశారు. పరిశ్రమలు రాలేదు. యాజమాన్యం మారిపోతోంది. అరబిందో చేతికి వెళ్లిపోయింది. అరబిందో నుంచి నేను పార్టీ ఫండ్ తీసుకోలేదు. మీరు అభిమానంతో ఇచ్చిన రూపాయే నాకు లక్షతో సమానం’ అని అన్నారు. ‘అరబిందో వాళ్లు ఏదో గ్రామం అభివృద్ధి చేశామని సీఎస్ఆర్ కింద ప్రకటించారు. ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కూటమి బాధ్యత తీసుకుంటుంది’ అని పవన్ హామీ ఇచ్చారు. ‘ఎస్ఈజెడ్లో ఇంకా ఎందుకు పరిశ్రమలు పెట్టలేదని అడిగితే. కోడి పొదగలేదు. గుడ్డు పెట్టలేదని మంత్రి చెప్పారు. వైకాపా కోడి కాదు. కట్లపాము. దాని గుడ్లు అదే తినేస్తుంది’ అని పేర్కొన్నారు.
నా వ్యక్తిగత జీవితం పైనా విమర్శలా?
‘పేదల కోసం మానవ హక్కులకు భంగం కలుగుతుంటే మాట్లాడాను. లక్షలమంది మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217ను చించేశాను. దానికి ఇంట్లో ఉన్న నా భార్యను తిడతారు. పెళ్లాం అంటారు. ఈ నాలుగో పెళ్లానికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘నా భార్య రాజకీయాల్లో ఉంటే మీరు తూలనాడినా అర్థం ఉంటుంది. పాపం తనెక్కడో కూర్చుని పిల్లలను చూసుకుంటోంది. అంతకుముందూ నాకు పెళ్లయింది నిజమే. నేను ఎక్కడా అబద్ధాలు చెప్పలేదే! కొన్ని జీవితాలు కుదరవు.. విడిపోయాం. నన్ను పెళ్లి చేసుకున్నవారు, ఎవరి జీవితాల్లోకి వారు వెళ్లిపోయారు. ఒకమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నది. నా బిడ్డలను ఇంకొకరు చూసుకుంటున్నారు. గుట్టుగా బతుకుతున్నవారిని కూడా తీసుకొచ్చి పెళ్లాలు అంటే ఎలా?’ అని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘భారతి గారిని పేరుపెట్టి పిలవాలంటే తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అడ్డొస్తోంది. నన్ను, చంద్రబాబును తిడితే సంతోషపడకండి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేప్పొద్దున అది మీకు కూడా జరుగుతుంది. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని ప్రజలను పవన్్ కల్యాణ్ కోరారు. ‘హార్బర్ కట్టిస్తా.. జెట్టీలు నిర్మిస్తా అని చెప్పి నెరవేర్చని వ్యక్తి జగన్. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓట్లు అడిగే అర్హత లేదు. అయిదేళ్ల విలువైన కాలం మనం ఇస్తే ఈ రోజు ఏమీ నిర్మించలేకపోయారు అని పవన్ విమర్శించారు. ‘జగన్ లంచం తీసుకుంటే మనకొచ్చే నష్టమేంటి? జగన్ అవినీతి చేస్తే నా జేబులోంచి డబ్బులు తీసుకోవడం లేదు కదా.. అని అనుకోకండి. ఇకనైనా మీరు ఎంత నష్టపోయారో ఆలోచించండి. వైకాపాను సాగనంపండి’ అని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!