icon icon icon
icon icon icon

రోడ్లు వేసి.. ఓట్లు అడగండి

రోడ్లు, డ్రెయిన్లు నిర్మించి ఆ తరువాత ఓట్లు అడగాలంటూ పలువురు మహిళలు పిఠాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వంగా గీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగా గీత మంగళవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ప్రచారం నిర్వహించారు.

Published : 24 Apr 2024 06:06 IST

వైకాపా అభ్యర్థి వంగా గీతపై మహిళల ఆగ్రహం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: రోడ్లు, డ్రెయిన్లు నిర్మించి ఆ తరువాత ఓట్లు అడగాలంటూ పలువురు మహిళలు పిఠాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వంగా గీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగా గీత మంగళవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ప్రచారం నిర్వహించారు. ఈబీసీ కాలనీ, దేవీనగర్‌ శివారు ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా సిమెంటు రోడ్లు నిర్మించక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు సమస్యలపై ఏకరువు పెట్టారు. రోడ్లు వేసి ఓట్లు అడగాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నచ్చజెబుతూనే.. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు చేపడతానని వంగా గీత ముందుకు సాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img