icon icon icon
icon icon icon

సీఎం సిద్ధం సభకు 1,100 ఆర్టీసీ బస్సులు

సీఎం జగన్‌ సిద్ధం సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ డిపోల్లో 80 శాతం బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు మంగళవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 24 Apr 2024 06:21 IST

విజయనగరం కోట, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ సిద్ధం సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ డిపోల్లో 80 శాతం బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు మంగళవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాంధ్రలోని డిపోల నుంచి 1,100 బస్సులు తరలించినట్లు సమాచారం. విజయనగరం బస్టాండులో పార్వతీపురం, సాలూరు, ఎస్‌ కోట, అనకాపల్లి, సింహాచలం, శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి మార్గాల్లో వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండులో గంటల సమయం వేచి చూశారు. వృద్ధులు, పిల్లలు నరకయాతన పడ్డారు. అప్పుడప్పుడూ బస్సులు వచ్చినా.. జనం ఎక్కువగా ఉండటంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. కొందరు వేచిచూడలేక అధిక ధరలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img