icon icon icon
icon icon icon

కోడ్‌ అమల్లో ఉన్నా దళితులపై ఆగని దాడులు

వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల అరాచకాల్ని భరించలేక.. దిల్లీలో శ్రీలక్ష్మి అనే మహిళ తన బొటన వేలు నరుక్కొన్న ఘటన రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు.

Published : 24 Apr 2024 06:41 IST

తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల అరాచకాల్ని భరించలేక.. దిల్లీలో శ్రీలక్ష్మి అనే మహిళ తన బొటన వేలు నరుక్కొన్న ఘటన రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా దళితులపై దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయిదేళ్ల వైకాపా పాలనలో బడుగుబలహీన వర్గాలు, మైనార్టీలపై దాడులు పెరిగాయి. ఈ ఎన్నికల్లో జగన్‌ను చిత్తుగా ఓడించాలి’ అని మాణిక్యరావు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img