icon icon icon
icon icon icon

రంగుల ‘కల’లతో సైకిల్‌ గుర్తు..!

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ తీశారు.

Published : 25 Apr 2024 06:30 IST

న్యూస్‌టుడే, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ తీశారు. ‘గుర్తు గుర్తుంచుకో.. సైకిల్‌ గుర్తుంచుకో..’ అంటూ కొందరు కళాకారులు వినూత్న వేషధారణతో సైకిల్‌ బొమ్మలతో నృత్యాలు చేస్తూ ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. పాత గుర్తే.. ప్రజల కలలు నెరవేర్చేందుకు.. రంగుల కళలతో ముందుకొచ్చిందంటూ ప్రచారం చేస్తూ ముందుకు సాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img