icon icon icon
icon icon icon

త్రిమూర్తులుపై ‘శిరోముండనం’ సహా 3 కేసులు

మండపేట వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దంపతుల పేరిట రూ.18.25 కోట్ల ఆస్తులున్నాయి.

Published : 25 Apr 2024 06:32 IST

మండపేట వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దంపతుల పేరిట రూ.18.25 కోట్ల ఆస్తులున్నాయి. వాటిలో రూ.1.2 కోట్లు చరాస్తులు. రూ.17.13 కోట్లు స్థిరాస్తులు. భార్యకు కారు (రూ.33 లక్షలు) ఉంది. ఇద్దరి వద్ద 900 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి నగలున్నాయి. వీరి అప్పు రూ.2.49 కోట్లు. త్రిమూర్తులుపై ద్రాక్షారామం ఠాణాలో 1997లో నమోదైన ‘శిరోముండనం’ కేసులో విశాఖపట్నం కోర్టు ఇటీవల జైలు శిక్ష, అపరాధ రుసుం విధించింది. జరిమానా చెల్లించగా, తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై మరో 2 కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img