కాపు రిజర్వేషన్లకు గండి కొట్టిందే వైకాపా
‘కాపు రిజర్వేషన్లకు గండి కొట్టింది వైకాపా.. 27 దళిత పథకాలను తీసేసింది జగన్.. ఈ ప్రభుత్వ పాలనలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు.
27 దళిత పథకాలు తీసేసిందీ జగనే
30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైంది వీళ్ల పాలనలోనే
అలాంటి పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తున్నారో వైకాపా అభ్యర్థులు చెప్పాలి
మనం మారాల్సిన.. ముఖ్యమంత్రిని మార్చాల్సిన సమయమిది
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఈనాడు, కాకినాడ: ‘కాపు రిజర్వేషన్లకు గండి కొట్టింది వైకాపా.. 27 దళిత పథకాలను తీసేసింది జగన్.. ఈ ప్రభుత్వ పాలనలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. ఈ ప్రభుత్వ హయాంలోనే 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అదేం చెప్పకుండా, మేం వచ్చాం.. మాకు ఓట్లెయ్యండి.. రూ. 400 కోట్లు ఖర్చుపెడతాం. ఓటుకు రూ. 10 వేలు ఇస్తాం.. రూ. 10 లక్షలు పెట్టి నాయకులను కొనేస్తామంటే కుదరదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. కాకినాడలో జనసేన- తెదేపా- భాజపా కూటమి లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమని.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని, ఓ తరం కోసమని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎంను మార్చాల్సిన సమయమిది..
జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని మోదీ చెప్పారని పవన్ అన్నారు. 30 కేసులు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయనను మార్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. జగన్కు ఐదేళ్లు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఏ పథకమూ సవ్యంగా అందడంలేదని తెలిపారు. 5 కోట్ల ప్రజలకు తాము మాట ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.
గంజాయి కేంద్రంగా కాకినాడ..
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైందని, గంజాయికి కేంద్రంగా మారిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాకినాడ వైకాపా లోక్సభ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తనను గెలిపిస్తే రూ. 400 కోట్లతో గ్రామాలు అభివృద్ధి చేస్తానని.. గెలుపు తనదేనని అంటున్నారు కదా’ అని విలేకర్లు పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా, ‘నాలుగైదు నెలలుగా రూ. 400 కోట్లు మాత్రం కలెక్ట్ చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. సునీల్ తమకు శత్రువు కాదని.. తమ కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందన్నారు. ఆయన ప్రతిసారి అవకాశవాదంతో ఎన్నికల్లో నిలబడడం, వెళ్లిపోవడం.. వంటివి సరైన సంకేతాలు కావన్నారు. ‘నేను ఓడిపోగానే పార్టీ మూసేసి వెళ్లిపోయి, మళ్లీ వస్తే నమ్ముతారా’.. అని పవన్ ప్రశ్నించారు
డప్పుల దరువు.. పవన్ స్టెప్పులు..
కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్డుషోలో కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామితో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. డప్పు కొడుతుండగా.. పవన్ చేతులు ఊపుతూ చిన్నపాటి స్టెప్పులేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఎండ తీవ్రతకు నీరసించిన పవన్ ర్యాలీ ముగిసే సమయంలో ప్రచార రథంపైన, తర్వాత ద్విచక్రవాహనం పైనా కాసేపు సేదతీరారు. అనంతరం అభ్యర్థితో కలిసి నామినేషన్ దాఖలుకు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు.
29న తిరుపతి రానున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 29న తిరుపతిలో పర్యటించనున్నారు. తొలుత 26న తిరుపతిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా.. 29కి వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?