icon icon icon
icon icon icon

జగన్‌ ఓ స్టిక్కర్‌ సీఎం

జగన్‌ ఓ స్టిక్కర్‌ సీఎం అని, ఎన్నికలు ముగిసేదాకా ఆయన తన నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ తీయరని తెదేపా విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్‌ ఎద్దేవా చేశారు.

Published : 27 Apr 2024 05:48 IST

తెదేపా విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి దర్శిత్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ ఓ స్టిక్కర్‌ సీఎం అని, ఎన్నికలు ముగిసేదాకా ఆయన తన నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ తీయరని తెదేపా విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్‌ ఎద్దేవా చేశారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ రోజుకో కంటికి బ్యాండేజ్‌ మారుస్తూ.. ఓటర్లను ఏమార్చాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గులకరాయి తనకు తగిలిందని నాటకాలాడుతున్న జగన్‌.. అయిదేళ్లుగా తమపై దాడి చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో తలకు, కంటికి, చేతులకు బ్యాండేజ్‌లు కట్టుకుని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ అయిదేళ్లలో వందల మంది యువకులు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తానని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక  ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు’’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img