icon icon icon
icon icon icon

తెదేపాలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌

మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌.. ఆయన అనుచరులతో కలిసి శుక్రవారం తెదేపాలో చేరారు.

Published : 27 Apr 2024 05:49 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌.. ఆయన అనుచరులతో కలిసి శుక్రవారం తెదేపాలో చేరారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే.. హైదరాబాద్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైకాపా నుంచి తాడికొండ టికెట్‌ ఆశించి నిరాశపడిన డొక్కా.. గత కొన్ని రోజులుగా అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img