సచివాలయంలో ఎన్డీయే నేతల మెరుపు ధర్నా
పింఛన్ల పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్ర సచివాలయంలో ఎన్డీయే నేతలు మెరుపు ధర్నా చేశారు. సీఎస్, సీఎం కార్యాలయాలు ఉండే భవనం వద్ద మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు.
ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై సీఎస్ వైఖరికి నిరసన
సచివాలయం మెట్లపై కూర్చొని ఆందోళన
నాయకులను ఈడ్చిపడేసిన పోలీసులు
ఈనాడు, అమరావతి: పింఛన్ల పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్ర సచివాలయంలో ఎన్డీయే నేతలు మెరుపు ధర్నా చేశారు. సీఎస్, సీఎం కార్యాలయాలు ఉండే భవనం వద్ద మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు. వినతిపత్రం ఇచ్చిన నేతలకు సీఎస్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో నాయకులు వెలుపలకు వచ్చి ఆకస్మికంగా ధర్నాకు దిగారు. ‘ఒకటో తేదీన ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలి.. పేదల ప్రాణాలను బలి తీసుకోవద్దు. సీఎస్ జవహర్రెడ్డి మొండి వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మే ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగించారు. సీఎస్ అనుమతితో వచ్చామని నేతలు చెప్పినా వినకుండా పోలీసులు వారిని ఈడ్చి పడేశారు. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో ఎన్డీయే నేతలు సీఎస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసీ లేఖలో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.
వినతి పత్రంలో ఇలా.. రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని సీఎస్కు ఎన్డీయే నేతలు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 1.26 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అదనంగా 35వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు ఉన్నారు. ఒక్కొక్కరు 20మందికి పింఛన్లు పంపిణీ చేస్తే రెండు రోజుల్లో పూర్తి చేయవచ్చు’ అని సీఎస్కు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు మన్నవ సుబ్బారావు, పిల్లి మాణిక్యాలరావు, బుచ్చిరాంప్రసాద్, జనసేన నేత రవికృష్ణ నున్నా పాల్గొన్నారు.
సీఎస్ వినే పరిస్థితిలో లేరు
-వర్ల రామయ్య
‘ఎన్నికల కోడ్ వచ్చినా ఇంకా రాక్షస పాలన కొనసాగుతూనే ఉంది. సీఎస్ స్పందన సరిగా లేదు. ఈసీకి మేము చెప్పుకొంటామని ఆయన అన్నారు. ఆయన వినే పరిస్థితిలో లేరు. సీఎస్ ఏదో ప్రభావితమైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. సీఎస్ దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచన కారణంగా ఏప్రిల్ నెలలో పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇళ్లవద్దే పింఛన్లు పంపిణీ చేయాలని కోరితే సిబ్బంది లేరని చెబుతున్నారు. ఈసారి ఒక్క ప్రాణం పోయినా సీఎస్ జవహర్రెడ్డి, సీఎం జగన్ బాధ్యత వహించాలి’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
వైకాపాకు కొమ్ముకాస్తున్న సీఎస్
దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
‘వైకాపా కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన బిల్లులు రూ.13 వేల కోట్లు మార్చి నెలాఖరులో చెల్లించి, ఖజానా ఖాళీ చేశారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు పింఛన్ డబ్బులు విడుదల చేయలేదు. ఓ వృద్ధురాలి శవాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి, శవ రాజకీయాలు చేసేందుకు మంత్రి జోగి రమేష్ ప్రయత్నించారు. సీఎస్ జవహర్రెడ్డి వైకాపాకు కొమ్ముకాస్తూ ఇంటి వద్దకు పింఛన్లు ఇవ్వడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చూస్తాం. ఆలోచిస్తాం.. అంటున్నారే తప్ప మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదు’ అని దేవినేని ఉమా ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని సీఎస్ మెలిక పెడుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మండిపడ్డారు. గత నెలలో సంభవించిన పింఛన్దారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు