ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టాను.. మార్కులు మీరే వేయండి
మ్యానిఫెస్టోను 99 శాతం అమలుచేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు. చెప్పిన మంచి చేసి చూపించిన తర్వాతనే ప్రజల ఆశీస్సులు కోరేందుకు వచ్చానన్నారు.
అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం
విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం
తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్
ఈనాడు - తిరుపతి, నెల్లూరు, ఈనాడు డిజిటల్ - అనంతపురం
మ్యానిఫెస్టోను 99 శాతం అమలుచేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు. చెప్పిన మంచి చేసి చూపించిన తర్వాతనే ప్రజల ఆశీస్సులు కోరేందుకు వచ్చానన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ‘58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు పెట్టాను. మీరే మార్కులు వేయండి. రాబోయే అయిదేళ్లలో పిల్లలు ఆంగ్లమాధ్యమంలోనే చదువుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి’ అని కోరారు. తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలో 133 సార్లు బటన్ నొక్కాను. రూ.2.70 లక్షల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాలకు జమచేశాను. ఇంటింటా జరిగిన మంచిని, అభివృద్ధిని చూపించి మీ ఆశీస్సులు, దీవెనలు అడుగుతున్నా. సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. పేదింటి పిల్లల కోసం బడుల్లోనే మంచి ఆహారం అందిస్తున్నాం. దుస్తుల నుంచి పుస్తకాలు, డిజిటల్ బోర్డులు, ట్యాబులు అందించి విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాం. ఉద్యోగం కోసం ఇంగ్లిష్లో మాట్లాడే విప్లవాత్మక మార్పును తీసుకొస్తాం’’ అని జగన్ హామీ ఇచ్చారు.
చేతల్లో చూపించాం
‘‘అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, పేదలకు 31 లక్షల వంటి పథకాలు గతంలో ఎవరైనా ఇచ్చారా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు 50% రిజర్వేషన్లు అందించాం. మంత్రిమండలిలో 65% పదవులు వారికే ఇచ్చాం. 175 అసెంబ్లీ స్థానాలు, 25ఎంపీ స్థానాల్లో ఏకంగా వందసీట్లు కేటాయించా. జరిగిన మంచిని చూసి దీవెనలు ఇవ్వాలి’’ అని జగన్ కోరారు.
మాకు ఓటేస్తేనే పథకాలు.. లేకుంటే ముగింపే
తనకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు వేస్తే ఆయన వాటికి ముగింపు పలుకుతారని సీఎం జగన్ పేర్కొన్నారు. తాము చేసిన కొన్ని పథకాల పేర్లు చెబుతామని, మీరు చేసిన మంచి ఏమైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. వెంకటగిరిలోని త్రిభువని కూడలిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ‘58 నెలల్లో అనేక పథకాలు తెచ్చాం. 2014-19లో జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేశారు. 2019లో మేం వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చాం. మీరు పెట్టిన జన్మభూమి కమిటీలపై నమ్మకం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పండి’ అని చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ‘నేను రూ.1 అంటే చంద్రబాబు రూ.2 ఇస్తానంటారు. నేను రూ.2 అంటే ఆయన రూ.8 అంటారు. వేలంపాట తరహాలో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014లో ఇదే కూటమి తమ మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఇదే కూటమి సూపర్-6, 7 పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైంది’ అని జగన్ విమర్శించారు.
భద్రతా వైఫల్యం..
వెంకటగిరిలో ఏర్పాటుచేసిన సీఎం హెలిప్యాడ్ వద్దకు ఓ వ్యక్తి దూసుకురావడం చర్చనీయాంశమైంది. తిరుగు ప్రయాణమయ్యే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీరు పెంచలయ్య బారికేడ్లు దూకి హెలికాప్టర్ వద్దకు పరుగులు తీశాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
రానున్న ఐదేళ్లను నిర్ణయించే ఎన్నికలివి
కందుకూరు సభలో మాట్లాడుతూ... ‘ఈ సారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తుని. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని ఓట్లు వేయాలి’ అని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్ పాల్గొన్నారు.
జగన్ వస్తున్నారంటే హడల్..
సీఎం జగన్ పర్యటన అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కందుకూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ అయితే.. 12 గంటల నుంచే ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. కందుకూరు ఏరియా ఆసుపత్రిలోకి వెళ్లేందుకు వీల్లేకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు.108 వాహనం వస్తే వెనక వైపు వెళ్లాలని సూచించారు. సభ అనంతరం ప్రచారరథాలు పామూరు బస్టాండులో రోడ్డుకు ఇరువైపులా ఉంచి వైకాపా కార్యకర్తలు నృత్యాలు చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు