icon icon icon
icon icon icon

వైకాపా మ్యానిఫెస్టోతో ‘జె’ గ్యాంగ్‌కే లబ్ధి

వైకాపా మ్యానిఫెస్టోతో సీఎం జగన్‌కు, ఆయన అనుచరులకు (జె గ్యాంగ్‌) మాత్రమే లబ్ధి చేకూరుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Published : 29 Apr 2024 05:44 IST

99 శాతం హామీలు అమలంటూ జగన్‌ అబద్ధాలు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా మ్యానిఫెస్టోతో సీఎం జగన్‌కు, ఆయన అనుచరులకు (జె గ్యాంగ్‌) మాత్రమే లబ్ధి చేకూరుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైకాపా 2019 మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో  99 శాతం అమలు చేశామంటూ జగన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధి సరిగా జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. జూమ్‌ ద్వారా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్థికాభివృద్ధి గురించి కాకుండా రెవెన్యూ లోటు గురించి జగన్‌ మాట్లాడుతున్నారు. 2014-15లో రెవెన్యూ లోటు 1.5 శాతమే. దాన్ని 2019 నాటికి సున్నాకు తీసుకురావాలని గత తెదేపా ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నాం. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని యనమల మండిపడ్డారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రూ.2.57 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు...2024లో రూ.14 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img