ఎన్డీయే ఉమ్మడి మ్యానిఫెస్టో నేడు
సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఇప్పటికే విశేషంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీయే.. పూర్తిస్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది.
చంద్రబాబు నివాసంలో విడుదల
హాజరుకానున్న తెదేపా, జనసేన, భాజపా నేతలు
ఇప్పటికే సూపర్ సిక్స్పై విస్తృత ప్రచారం
ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం
‘నేటి అవసరాలు.. రేపటి ఆకాంక్షలు’ ఇతివృత్తంగా ప్రణాళిక రూపకల్పన
ఈనాడు, అమరావతి: సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఇప్పటికే విశేషంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీయే.. పూర్తిస్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా ముఖ్యనేతలు పాల్గొననున్నారు. తెదేపా 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించింది. తెదేపా, జనసేన, భాజపా (ఎన్డీయే) పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీల నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ‘నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం’ అన్న ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతికి మరిన్ని కొత్త పథకాలను ఎన్డీయే ప్రకటించనుంది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం అమలు చేసి, వైకాపా రద్దు చేసిన పథకాల పునరుద్ధరణకు హామీ ఇవ్వనుంది. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు వంటివి వీటిలో ఉండనున్నాయి. ‘అధిక పన్నులు, భారాల బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి’ అన్నది ప్రధానాంశంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ‘అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదు. మా మ్యానిఫెస్టో సంపద సృష్టించి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందజేస్తామన్న భరోసానిస్తుంది. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తుంది. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు, కార్యక్రమాలకు అద్దం పడుతుంద’ని ఎన్డీయే వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి
ఎన్డీయే పక్షాలు ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. గతేడాది మహానాడులో ‘సూపర్ సిక్స్’ ప్రకటించిన తర్వాత తెదేపా ‘భవిష్యత్తుకు భరోసా’ పేరుతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టింది. లోకేశ్ ప్రజాగళం పాదయాత్రలో సూపర్ సిక్స్పై వివిధ వర్గాలతో చర్చలు నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు పలు దఫాలు ఇంటింటికీ వెళ్లి ఈ పథకాలను వివరించారు. కరపత్రాలు ముద్రించి పంచారు. ఎన్నికల ప్రచారంలోనూ ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్, టీవీ, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల రూపంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
నేటి పవన్ రోడ్ షో రద్దు
పిఠాపురం, న్యూస్టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నిర్వహించాల్సిన రోడ్షో రద్దయింది. ఆయన విజయవాడలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో రోడ్షో రద్దు చేసినట్లు జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్డీయే ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి
- మెగా డీఎస్సీపై మొదటి సంతకం.
- సామాజిక పింఛను రూ.4 వేలకు పెంపు. ఇది 2024 ఏప్రిల్ నుంచే వర్తింపు. ఇంటి వద్దే నగదు అందజేత.
- దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు.
- బీసీలకు 50 ఏళ్లకే పింఛను.
- ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
- యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
- నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
- ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
- రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
- వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు.
- ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.
- ఇసుక ఉచితం.
- బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
- ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
- పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ఏర్పాటు.
- భూ హక్కు చట్టం రద్దు.
- కరెంటు ఛార్జీలు పెరగవ్.
- చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.
- విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.
- పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.
- నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ.
- రైతులకు గతంలో తెదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ.
- ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ.
- చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?