జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దాం
అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు.
ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలి
ఈ ప్రభుత్వం ఆక్వా రైతును నిండా ముంచింది
అవినీతిలో రాటుదేలిన ‘కొట్టు’కు బుద్ధిచెప్పాలి
తాడేపల్లిగూడెం, గణపవరం వారాహి విజయభేరి సభల్లో పవన్ కల్యాణ్
ఈనాడు- ఏలూరు, కాకినాడ, ఈనాడు డిజిటల్- భీమవరం: అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో సోమవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలు, పిఠాపురం రోడ్షోలో ఆయన ప్రసంగించారు. ‘మన భూములు దోచుకోవడానికి జగన్మోహన్రెడ్డి ప్రమాదరకమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొస్తున్నార[ు. దీని ప్రకారం మీ ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తారు. మీ ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్ నానక్రామగూడలోని వైకాపా ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారు. ఈసారి వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలపెట్టుకున్నట్టే’ అని హెచ్చరించారు. ‘కేంద్రం ఇచ్చే పాస్పోర్టుపై కూడా ప్రధాని చిత్రం ఉండదు. దేశ రాజముద్ర మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు?’ అని ప్రశ్నించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఇప్పుడు పోరాడుతున్నానని యువతతో చెప్పారు. ‘జగన్ నాడు- నేడు పేరుతో విద్యావ్యవస్థను ఉద్ధరించారని చెబుతున్నారు. వైకాపా పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. 3.9 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. ఏపీలో 5-18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు 62 వేల మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్ సమస్యపై అసెంబ్లీలో బలమైన చర్చ జరిపి, పరిష్కారం కోసం పోరాడతామన్నారు.
జగన్ ఆక్వా రైతును నిండా ముంచారు
‘ఆక్వా రంగాన్ని జగన్ నిండా ముంచారు. తెదేపా ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు రూ.1.5కే అందిస్తే జగన్ రూ.5కి పెంచారు. గతంలో రూ.1600 ఉన్న మేత జగన్ ప్రభుత్వంలో రూ.2,750కి పెరిగింది. గిట్టుబాటు ధర లేక ఆక్వా రైతు కిలో రొయ్యకు రూ.50 వరకు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆక్వా రైతును ఆదుకుంటాం. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏలూరు కాలువ పూడిక కూడా తీయలేకపోయింది. నీటి సమస్య ఉన్న గ్రామాలకు పోలవరం కాలువ నుంచి నీరు సరఫరా చేస్తాం. ఆపరేషన్ కొల్లేరులో ధ్వంసమై, పరిహారం రాని జిరాయితీ భూములకు పరిహారం అందేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘రాష్ట్రంలో రహదారులు చూస్తేనే భయమేస్తోంది. ఈ రహదారుల్లో అంబులెన్సులు కూడా ప్రయాణించలేక ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఎన్నికలొచ్చే సమయానికి మాత్రం జగన్ మీ ఇంట్లో బిడ్డను.. తండ్రిలేని బిడ్డను అంటూ ఓట్లడుగుతున్నారు. ఆ బిడ్డ అధికారంలోకి రావాలంటే ఎవరో ఒకరు చావాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు జూదక్లబ్ బాగా నిర్వహిస్తున్నారని అభినందిస్తూ సీఎం ఆయనకు రూ.30 లక్షల విలువైన కారు బహుమతిగా ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే తన ఇంటికి కూడా రోడ్డు వేయించుకోలేకపోయారు. పోలవరం కుడికాలువను కొల్లగొట్టి అమ్ముకుంటున్నారు. శ్రీశైల మల్లికార్జునుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్కు పదవీగండం ఉందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దాన్ని వాయిదా వేయించేశారు. ఒంటిమిట్టకు ప్రొటోకాల్ ప్రకారం తాను వెళ్లకుండా.. ఇసుక, గనుల దోపిడీదారు పెద్దిరెడ్డిని పంపారు. పెత్తందార్ల మోచేతి నీళ్లు తాగే ఈ ఎమ్మెల్యే.. జనాన్ని దోచుకుంటున్నారు. మీ గుండెల్లో జ్యోతిని వెలిగించండి.. ఆ వెలుగులో కొట్టు సత్యనారాయణ అవినీతి దహించుకుపోవాలి’ అని ధ్వజమెత్తారు. ‘తాడేపల్లిగూడెంలో నిత్యావసర వస్తువుల రవాణా రంగం ఉంది. పక్క రాష్ట్రాలతో మాట్లాడి గ్రీన్టాక్స్ తగ్గేలా చూస్తాం. కూటమి వస్తే తాడేపల్లిగూడేన్ని ఎడ్యుకేషన్, మార్కెట్ హబ్గా మారుస్తాం’ అని హామీ ఇచ్చారు.
భవననిర్మాణ కార్మికుల సంక్షేమనిధికి రూ.కోటి విరాళం
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధినీ జగన్ దోచుకున్నారని పవన్ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. సంక్షేమనిధికి వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు