icon icon icon
icon icon icon

త్వరలో భాజపా వీధి కూడళ్ల సమావేశాలు

భాజపా అభ్యర్థులు పోటీచేసే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పరిధిలోని సుమారు 50 నియోజకవర్గాల్లో ఆ పార్టీ వీధి కూడళ్ల(స్ట్రీట్‌ కార్నర్‌) సమావేశాలు నిర్వహించబోతోంది.

Published : 30 Apr 2024 05:57 IST

ఈనాడు, అమరావతి: భాజపా అభ్యర్థులు పోటీచేసే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పరిధిలోని సుమారు 50 నియోజకవర్గాల్లో ఆ పార్టీ వీధి కూడళ్ల(స్ట్రీట్‌ కార్నర్‌) సమావేశాలు నిర్వహించబోతోంది. దీనిపై చర్చించేందుకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌సింగ్‌, సహ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ తదితరులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఇందులో కూటమి మంగళవారం విడుదల చేయనున్న మ్యానిఫెస్టోపైనా చర్చించారు. మరోవైపు.. త్వరలో తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. మే 7, 8వ తేదీలకు వాయిదాపడ్డ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

నడ్డాను కలిసిన సీనియర్‌ నేతలు: భద్రాచలం వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో ఆగిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొంతసేపు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై చర్చించారు. నడ్డాను కలిసిన వారిలో అరుణ్‌సింగ్‌, సిద్దార్థ్‌నాథ్‌, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img