కుట్రల కూటమితో యుద్ధం
‘‘రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవసైన్యం, దుష్టచతుష్టయం, చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న రెండు జాతీయపార్టీలు, దత్త పుత్రుడితో కూడిన కుట్రల కూటమితో యుద్ధం చేస్తున్నాం’’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు.
ఎవరివల్ల మేలు జరిగితే వాళ్లకే ఓటు వేయండి
పేదలకు మంచి చేసినందుకే నన్ను ఓడించాలా?
చోడవరం, అంబాజీపేట, పొన్నూరు సభల్లో సీఎం జగన్
ఈనాడు-అమరావతి, రాజమహేంద్రవరం, అనకాపల్లి: ‘‘రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవసైన్యం, దుష్టచతుష్టయం, చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న రెండు జాతీయపార్టీలు, దత్త పుత్రుడితో కూడిన కుట్రల కూటమితో యుద్ధం చేస్తున్నాం’’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. చోడవరం సభలో మాట్లాడుతూ, ‘2014లో చంద్రబాబు ఇప్పుడున్న కూటమిలో ముగ్గురి ఫొటోలు పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్ గుర్తుందా..? హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది, ఏమైంది? గోవిందా.. గోవింద. దిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా..గోవిందా. సింగపూర్ని మించిన రాజధాని అని పక్కనే అన్ని హబ్లతో కనిపించిన వైజాగ్ను వదిలేశారు.. మరి ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది.. గోవిందా! ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి’ అన్నారు. ‘ఓటుకు రూ.2-5 వేలు ఇస్తారు.. వద్దనకండి తీసుకోండి. ఓటేసే ముందు ఆలోచించి ఎవరివల్ల మేలు జరిగిందో వారికే ఓటు వేయండి’ అని సీఎం కోరారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థికరణం ధర్మశ్రీ, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు గొల్ల బాబూరావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపించారు. చోడవరం ప్రధాన రహదారిపై రోడ్షో ఏర్పాటు చేయడంతో ఇరువైపులా పది కి.మీ. ముందే వాహనాలను నిలిపేశారు. దీంతో ప్రయాణికులంతా పిల్లా పాపలతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయని విద్యుత్తు తీగలను కట్చేయడంతో కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
జగన్ను ఎందుకు ఓడించాలి?
పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట సభలో మాట్లాడుతూ, ‘ఈ ఎన్నికల్లో జగన్ను ఎందుకు ఓడించాలి.. బాబుకు ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. 2014 ఎన్నికల ముందు వాళ్లు ఏం చెప్పారు? ఏం చేశారో తెలిసీ ఓటేస్తారా?’ అని జగన్ ప్రజలను ప్రశ్నించారు. ‘గడిచిన 58 నెలల్లో పేదలకు మంచి చేసినందుకా? ఇచ్చిన మాట తప్పనందుకా? రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అందజేసినందుకా ఓడించాలి’ అని ప్రశ్నించారు.
ఇలా.. ఇలా.. అంటూ నవ్వులపాలు
జగన్ తన ప్రసంగంలో.. 2014లో తెదేపా ముద్రించిన హామీల కరపత్రంలో ఒక్కో అంశం చదువుతూ.. మీరంతా ఇలా.. ఇలా.. అంటూ చేతులు ఊపాలని (అరచేయి అడ్డంగా ఊపడం) పదే పదే చెప్పించే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. ముఖ్యమైన హామీలు చదువుతూ ప్రత్యేకహోదా తెచ్చారా? అనగానే.. మరి నువ్వుకూడా తేలేదుగా అంటూ హాజరైనవారిలో కొందరు వ్యాఖ్యానించడం వినిపించింది. మేలు చేసే ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట, తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలన్నారు. పి.గన్నవరం అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ను ప్రజలకు పరిచయం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం వస్తారనగా, ఉదయం 10 గంటల నుంచే అంబాజీపేట వైపు వచ్చే బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఇబ్బంది ఎదురైంది. మండుటెండలో ట్రాఫిక్ ఆంక్షలతో అంతా ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆలోచించి ఓటేయాలి
గుంటూరు జిల్లా పొన్నూరు సభలో మాట్లాడుతూ, పేదవారికి మంచి చేయని కూటమితో జగన్ ఒక్కడే యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రాబోయే అయిదేళ్లలో ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తు, తలరాతల్ని నిర్ణయించే ఎన్నికలు అని, ఆలోచించి ఓటేయాలని కోరారు. చంద్రబాబు హైదరాబాద్కు వెళ్లిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తాను ఇంటింటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచిపనైనా చేశారా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో 68%, భర్తీచేసిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 80%, ఆలయ కమిటీలు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ 50%, ప్రస్తుత ఎన్నికల్లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి చూపించామన్నారు. కాగా పొన్నూరులో సీఎం ప్రసంగం చప్పగా సాగింది. పొన్నూరు అభివృద్ధికి ఏం చేస్తామో చెప్పకపోవడంతో ప్రజల్లో ఉత్సాహం కనిపించలేదు. కొందరు ఆటోల్లోంచి దిగకుండా అక్కడే ఉండిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?