icon icon icon
icon icon icon

జగన్‌ను ఓడించడమే మాలల లక్ష్యం: మల్లెల వెంకట్రావు

ఎస్సీ, ఎస్టీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఐదేళ్లుగా వారిని పూర్తిగా అణచివేశారని మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మండిపడ్డారు.

Published : 30 Apr 2024 06:13 IST

గుంటూరు(అరండల్‌పేట), న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఐదేళ్లుగా వారిని పూర్తిగా అణచివేశారని మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మండిపడ్డారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా మాలలు రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తారని పేర్కొన్నారు. మాల సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తే ఎస్సీలనే హత్యలు చేయించి శవాలను ఇళ్లకు పంపించిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు రద్దు చేసి రూ.70 వేల కోట్ల ఉపప్రణాళిక నిధులు దారి మళ్లించారని, ఆయన్ని మాలలు క్షమించరని, వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాల సంఘాల ఐకాస తెదేపాకు సంపూర్ణ మద్దతు తెలియజేసి, ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలోని 40 మాల సంఘాలు తెదేపా అధినేత చంద్రబాబును కలిసి జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నీ తిరిగి ప్రారంభించాలని చర్చించిన అనంతరం మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాల సంఘాల ఐకాస నాయకులు గోళ్ల అరుణ్కుమార్‌, కొండపల్లి విల్సన్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img