icon icon icon
icon icon icon

పవన్‌ను ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా: ముద్రగడ సవాల్‌

ఎక్కడి నుంచో ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేసి గెలిపించేస్తారనుకుంటున్నారా.. వారు తన్ని తరిమివేయడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.

Updated : 01 May 2024 07:41 IST

కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఎక్కడి నుంచో ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేసి గెలిపించేస్తారనుకుంటున్నారా.. వారు తన్ని తరిమివేయడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్‌ కల్యాణ్‌ అడుగుతున్నారని.. వారిని ప్రశ్నించే హక్కు ఆయనకు ఎక్కడిదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img