icon icon icon
icon icon icon

తెదేపా ప్రచార రథంపై దాడి

శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామ సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి ప్రచార రథానికి ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ పగలగొట్టి, ఫ్లెక్సీలను చించేశారు వైకాపా నాయకులు.

Published : 01 May 2024 06:32 IST

ప్రచారానికొస్తే కాల్చేస్తామని వైకాపా శ్రేణుల హెచ్చరికలు

బుక్కపట్నం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామ సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి ప్రచార రథానికి ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ పగలగొట్టి, ఫ్లెక్సీలను చించేశారు వైకాపా నాయకులు. ప్రచారం చేయడానికి ఈ ప్రాంతానికి వస్తే వాహనాన్ని సైతం కాల్చేస్తామని బెదిరించడంతో డ్రైవర్‌ భయాందోళనకు గురయ్యారు. దీనిపై తెదేపా నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా వైకాపా నాయకులు ఓర్చుకోవడం లేదని, దౌర్జన్యాలకు దిగుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img