icon icon icon
icon icon icon

ఎంవీవీ కార్యాలయంలో భారీగా తాయిలాల గుర్తింపు

విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు భారీ సంఖ్యలో తాయిలాలను గుర్తించారు.

Published : 05 May 2024 06:41 IST

అధికారుల సోదాల్లో బహిర్గతం

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు భారీ సంఖ్యలో తాయిలాలను గుర్తించారు. లాసన్స్‌బే కాలనీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సుమారు 6 గంటల పాటు ఈ సోదాలు సాగాయి. తాయిలాలను ఎలా పంచాలనే విషయంపై అనుచరగణానికి శిక్షణ ఇస్తుండగా.. నాలుగు బృందాలు దాడులు చేశాయి. ఈ సమయంలో రూ.30 వేల నగదు, 500 చీరలు, 400 టీషర్టులు, ఆటోడ్రైవర్ల యూనిఫామ్స్‌, 3 డిజిటల్‌ వాచ్‌లు, రూ.5 వేలు, రూ.4 వేలు, రూ.3 వేల టోకెన్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని విశాఖ మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో 30 మంది అధికారులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా సిద్ధం సభల్లో ఈ పంపకాలు జరుగుతుండటంతో ఎన్నికల అధికారులకు అందిన సమాచారం మేరకు   ఈ దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఎంవీవీ, ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావు (జీవీ) అక్కడే ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img