icon icon icon
icon icon icon

జగన్‌కు మద్దతుగా మండలి ఛైర్మన్‌ ప్రచారం

‘రాష్ట్ర అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ఎంతో చేశారు. కరోనా సమయంలోనూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు. ఆయనకు అంతా మద్దతు ఇవ్వాలి’ అని శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు కోరారు.

Published : 06 May 2024 05:41 IST

భీమవరం పట్టణం, ఆకివీడు, న్యూస్‌టుడే: ‘రాష్ట్ర అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ఎంతో చేశారు. కరోనా సమయంలోనూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు. ఆయనకు అంతా మద్దతు ఇవ్వాలి’ అని శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు కోరారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రచారాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆయన భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమావేశంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ వివరాలను ప్రకటన రూపంలోనూ విడుదల చేశారు. ఈ సమావేశానికి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సభాపతి, మావుళ్లమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు, ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు మానేపల్లి గుప్తా హాజరయ్యారు.

ఆకివీడులో ఆదివారం జరిగిన దళిత, దళిత క్రైస్తవుల ఆత్మీయ సమావేశంలోనూ మోషేనురాజు మాట్లాడారు. జగన్‌కు మనమంతా అండగా నిలవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img