icon icon icon
icon icon icon

తెదేపా ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు

నంద్యాల జిల్లా బనగానపల్లిలో తెదేపా శ్రేణులు ప్రచారం చేస్తుండగా వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

Published : 08 May 2024 05:22 IST

బనగానపల్లిలో ఉద్రిక్తత

నంద్యాల, బనగానపల్లి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా బనగానపల్లిలో తెదేపా శ్రేణులు ప్రచారం చేస్తుండగా వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం పట్టణంలోని మార్కెట్‌ పరిసరాల్లో ఉదయం వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సతీమణి జయమ్మ ప్రచారం చేసి వెళ్లిపోయారు. అనంతరం అక్కడ బనగానపల్లి తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ప్రచారానికి వచ్చారు. అక్కడే వైకాపా ప్రచార రథం ఉండటంతో పక్కకు తీసుకెళ్లాలని వైకాపా కార్యకర్తలకు సూచించారు. పోలీసులు చెప్పినా వారు తీసుకెళ్లకపోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ జరుగుతుందని తెలియగానే ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుళరెడ్డి మార్కెట్‌లోకి వచ్చారు. రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు ఇందిరమ్మతో పాటు తెదేపా వర్గీయులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇందిరమ్మకు ఎలాంటి హాని జరగకూడదని తెదేపా శ్రేణులు ప్రతిదాడులకు దిగడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img